Duggirala: బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి భర్త హత్య.. భార్య సహా నిందితుల అరెస్టు

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

దుగ్గిరాల: ప్రియుడితో కలిసి భర్తను చంపిన ఘటనలో భార్య సహా నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. నిందితులు గోపీ, లక్ష్మీ మాధురి, సురేశ్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్లడించారు.
‘‘గోపీకి, లక్ష్మీమాధురికి వివాహేతర సంబంధం ఉంది. లక్ష్మీమాధురి భర్త శివనాగరాజును చంపేందుకు వీరు పథకం పన్నారు. ఆర్ఎంపీ సురేశ్ వద్ద గోపీ నిద్రమాత్రలు తీసుకుని లక్ష్మీమాధురికి ఇచ్చాడు. నిద్రమాత్రలను బిర్యానీలో కలిపి శివనాగరాజుకు పెట్టారు. బిర్యానీ తిన్న అనంతరం నిద్రమత్తులో ఉన్న అతడి గుండెపై అప్పడాల కర్రతో కొట్టి చంపారు. ఈ నెల 18న శివనాగరాజు అనుమానాస్పద మృతిపై కేసు నమోదైంది. అతడి మృతదేహంపై ఎలాంటి గాయాలూ లేవు. ఛాతీ ఎముకలు విరిగినట్లు శవపరీక్షలో తేలింది’’ అని ఎస్పీ వెల్లడించారు.
చిలువూరుకు చెందిన ఉల్లిపాయల వ్యాపారి లోకం శివనాగరాజు ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆయనకు లక్ష్మీమాధురితో 2007లో వివాహమైంది. వీరికి ఇద్దరు మగపిల్లలు. భార్య విజయవాడలో సినిమాహాల్లో టికెట్ కౌంటర్లో పనిచేసేది. ఆ సమయంలో సత్తెనపల్లికి చెందిన గోపితో పరిచయం అయ్యింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త వ్యాపారాన్ని నామోషీగా భావించిన ఆమె ఆ వ్యాపారం మాన్పించేసింది. గోపి హైదరాబాద్లో కారు ట్రావెల్స్ నిర్వహిస్తుండడంతో అక్కడికి ఉద్యోగానికి పంపింది. కొంతకాలం తర్వాత నాగరాజు హైదరాబాద్ నుంచి చిలువూరు వచ్చేశారు. దీంతో భార్యాభర్తల మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. నాగరాజు ఎక్కువగా ఇంటివద్ద నుంచే వ్యాపారం చేస్తుండడంతో ప్రియుడితో సంబంధానికి అడ్డుగా మారింది. ఎలాగైనా అడ్డు తప్పించుకోవాలని లక్ష్మీమాధురి భావించింది.
► Read latest Amaravati krishna Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ఉపాధి హామీ పనుల పూర్తికి పరుగులు [ 17-02-2026] మరో 40 రోజుల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ముగిసిపోతుండడం, వీబీజీరామ్జీ పేరుతో సరికొత్తగా ప్రారంభమవుతున్న నేపథ్యంలో పనులు, పద్దులను యుద్ధప్రాతిపదికపై ముగించేందుకు అధికారులు దృష్టి సారించారు.
- బడ్జెట్ లేదంటారు... బకాయిలు కట్టరు! [ 17-02-2026] కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఆస్తిపన్ను వసూలు చేసేందుకు గుంటూరు నగరపాలక సంస్థ ఆపసోపాలు పడుతోంది. ఏటా బడ్జెట్ లేదన్న సాకుతో చాలా కార్యాలయాలు బకాయి పెడుతున్నాయి.
- వారు ఆడిందే ఆట! [ 17-02-2026] అధికారుల నిర్లిప్తత.. స్వార్థం... గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల పరువు తీస్తున్నాయి. అవినీతి అక్రమాలపై అంతులేని ఆరోపణలున్నా ఏళ్ల తరబడి పాతుకుపోయి రాజకీయ అండతో శాసిస్తూ.. నచ్చినట్టుగా వ్యవహారాలు నడిపిస్తున్నారు.
- అంబటి సంక్రాంతి వసూళ్ల కేసులో ముగిసిన వాదనలు [ 17-02-2026] మాజీ మంత్రి, వైకాపా నేత అంబటి రాంబాబుపై సంక్రాంతి వసూళ్ల కేసులో వాదనలు ముగిశాయి. తీర్పు ఈ నెల 18న వెలువరిస్తామని గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ కోర్టు జడ్జి కుముదిని ప్రకటించారు.
- పనిలో చేరగానే.. పసిడిపై కన్నేశాడు! [ 17-02-2026] పంజాగుట్టలోని బంగారు ఆభరణాల దుకాణంలో చోరీకి పాల్పడిన ఇంటిదొంగను సోమవారం అరెస్ట్ చేసినట్టు ఖైరతాబాద్ డీసీపీ కె.శిల్పవల్లి తెలిపారు. దొంగతనం జరిగిన 24 గంటల్లో నిందితుడిని పట్టుకున్న పంజాగుట్ట ఏసీపీ మురళీకృష్ణ.
- వినమ్రులై.. వి‘జేఈఈ’లై [ 17-02-2026] ఐఐటీ, ఎన్ఐటీలలో చదవాలనేది వారి ఆకాంక్ష... కల సాకారానికి సంకల్ప సిద్ధితో అడుగులేశారు.. చక్కటి ప్రణాళిక.. నిరంతర కార్యాచరణతో దూసుకెళ్లారు.
- అబ్బురం.. అభినందనీయం [ 17-02-2026] సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో రైతుల చొరవకు గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్గేట్స్ అబ్బురపడ్డారు. సాగు విధానాల్లో ఇక్కడి రైతులు ముందంజలో ఉన్నారని ప్రశంసల వర్షం కురిపించారు.
- విదేశీ విడిదికి వచ్చేశాయ్! [ 17-02-2026] ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం వెంకటాపురం గ్రామం వందల ఏళ్ల నుంచి విదేశీ విహంగాల విడిదిగా గుర్తింపు పొందింది. ఏటా క్రమం తప్పకుండా వచ్చే వేవ్స్ జాతి కొంగలు(వేవ్స్ స్టార్క్స్) కోసం గ్రామస్థులు ఎదురుచూస్తూ ఉంటారు.
- సులభతరం.. చేలోకి యంత్రం [ 17-02-2026] సాగులో ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ యాంత్రీకరణకు పెద్దపీట వేస్తోంది. రైతులకు వ్యయ, ప్రయాసలను తగ్గిస్తూ సులభతర పద్ధతులను అందుబాటులోకి తెస్తుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా కొన్నేళ్ల నుంచి ఆన్లైన్ సేవలను వ్యవసాయానికి అనుసంధానం చేస్తోంది.
- కాళ్లరిగేలా తిరిగినా.. కాస్తయినా కనికరించరా? [ 17-02-2026] ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ప్రతి అర్జీదారుడి సమస్యను సకాలంలో పరిష్కరించాలని సీఎం చంద్రబాబు ప్రతి సందర్భంలోనూ అధికారులకు సూచిస్తున్నా జిల్లాలో ఆశించిన స్థాయిలో ఫలితం ఉండట్లేదు.
- కొడుకులు ఉన్నా.. ఆదరించడం లేదు! [ 17-02-2026] ముదిమి వయసులో తనను కన్నబిడ్డలు ఆదరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఓ వృద్ధురాలు అధికారుల ఎదుట తన ఆవేదన వ్యక్తం చేసింది. మచిలీపట్నంలోని జవ్వారుపేటకు చెందిన షేక్ అస్మతున్నీసా లేవలేని స్థితిలో ఇబ్బందులు పడుతోంది.
- నాలుగేళ్ల చిన్నారిపై సొంత బంధువు లైంగిక దాడి [ 17-02-2026] పెదపారుపూడి మండలానికి చెందిన నాలుగేళ్ల బాలికపై సొంత పెదనాన్న లైంగిక దాడికి పాల్పడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. పామర్రు స్టేషన్లో గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినీల్ వెల్లడించిన వివరాల ప్రకారం..
- హలధారీ.. ఇదిగో సేంద్రియ దారి! [ 17-02-2026] రసాయనాలతో నిండిన సాగు పద్ధతులకు స్వస్తి చెప్పి ప్రకృతి సేద్యం వైపు రైతన్నను నడిపించేదుకు సేంద్రియ రైతోత్సవానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో 50 వేల ఎకరాల్లో సేంద్రియ సాగును ప్రోత్సహించాలనే లక్ష్యంతో రైతు సాధికార సంస్థ అడుగేస్తోంది.
- వేసవి డిమాండ్ తట్టుకునేందుకు విద్యుత్తు శాఖ సిద్ధం [ 17-02-2026] ఈ ఏడాది వేసవి విద్యుత్తు డిమాండ్ తట్టుకునేందుకు విద్యుత్తు శాఖ సన్నద్ధమైంది. ఏటా 20 నుంచి 30 శాతం విద్యుత్తు డిమాండ్ పెరుగుతుంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఉపకేంద్రాలు కొత్తవి ఏర్పాటు చేస్తారు.
- ఈ వినతి వెనుక లక్షల కుటుంబాల కన్నీళ్లు ఉన్నాయి [ 17-02-2026] వైకాపా ప్రభుత్వ హయాంలో 2019-24 మధ్య పేదలకు జారీ చేసిన ఇళ్ల పట్టాలు చెల్లుబాటు కాలేదని, వీటిపై విచారణ చేపట్టాలని భాజపా జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ నేతృత్వంలో.