లెక్చరర్స్‌ తిట్టారని తీవ్ర మనస్తాపం.. ఇంటర్‌ విద్యార్థిని మృతి

Eenadu icon
By Telangana Dist. Team Updated : 09 Jan 2026 15:41 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

మారేడుపల్లి: లెక్చరర్స్‌ తిట్టారని తీవ్ర మనస్తాపంతో ఓ ఇంటర్‌ విద్యార్థిని మృతి చెందిన ఘటన సికింద్రాబాద్‌లోని వెస్ట్ మారేడుపల్లిలో చోటుచేసుకుంది. మారేడుపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెస్ట్‌ మారేడుపల్లికి చెందిన విద్యార్థిని (17) ఎంఆర్ బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్‌ మొదటి ఏడాది చదువుతోంది. గురువారం కళాశాలకు గంట ఆలస్యంగా రావడంతో లెక్చరర్స్.. తోటి విద్యార్థుల ఎదుటే ఆమెను మందలించారు. దీంతో మానసికంగా కుంగిపోయిన విద్యార్థిని ఇంటికి వెళ్లి తల్లితో విషయం చెప్పింది. తర్వాత వెళ్లి మాట్లాడదామని తల్లి కుమార్తెను సముదాయించింది.

ఇంతలోనే విద్యార్థినికి తలనొప్పి రావడంతో స్పృహ తప్పి కింద పడిపోయింది. వెంటనే మల్కాజిగిరి ఆసుపత్రికి తరలించారు. అనంతరం గాంధీ ఆసుపత్రికి తరలించి సిటీ స్కాన్ చేయించారు. విద్యార్థిని ఎడమ చేయి, కాలు కూడా పనిచేయలేదు. స్కానింగ్ చేసిన వైద్యులు.. తీవ్ర మనస్తాపానికి గురికావడంతో బ్రెయిన్‌లో రక్తం గడ్డ కట్టిందని చెప్పారు. అనంతరం రాత్రి బాలిక మృతి చెందింది. దీంతో శుక్రవారం ఉదయం కళాశాల ముందు ఆమె తల్లిదండ్రులు, ఎమ్మార్పీఎస్‌ నేతలు, ఓయూ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. వెంటనే సదరు లెక్చరర్స్, ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

► Read latest Hyderabad Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 09 Jan 2026 13:55 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • పనిలో చేరగానే.. పసిడిపై కన్నేశాడు! [ 17-02-2026] బంగారు ఆభరణాల చోరీకి పాల్పడిన వ్యక్తిని సోమవారం రిమాండ్‌ చేసినట్టు ఖైరతాబాద్‌ డీసీపీ కె.శిల్పవల్లి తెలిపారు. 24 గంటల్లో నిందితుడిని పట్టుకున్న పంజాగుట్ట ఏసీపీ మురళీకృష్ణ, ఇన్‌స్పెక్టర్‌ రామకృష్ణ, డీఐ నాగరాజు, ఎస్సై సురేశ్‌ల బృందాన్ని అభినందించారు.
  • ‘ఛే’జిక్కాయి [ 17-02-2026] గ్రేటర్‌ శివారులోని 11 మున్సిపాలిటీల్లో సోమవారం జరిగిన ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఆధిపత్యం ప్రదర్శించింది. ఆరు ఛైర్మన్‌ పదవులను కైవసం చేసుకుంది.
  • రాజధానిగా జీహెచ్‌ఎంసీ [ 17-02-2026] అప్పటికీ.. ఇప్పటికీ.. జీహెచ్‌ఎంసీనే రాజధాని నగరంగా కొనసాగుతుందని.. అందుకు తగ్గట్లుగా పునర్విభజన జరిగిందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ.కర్ణన్‌ స్పష్టం చేశారు.రాజధానిలో ఏయే సదుపాయాలు ఉండాలో..
  • చీకట్లో మెరిసేలా.. వాహనదారులకు తెలిసేలా [ 17-02-2026] రాత్రి వేళ రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా రవాణా వాహనాలకు అమర్చే రిఫ్లెక్టివ్‌ టేపులు, రియర్‌ మార్కింగ్‌ ప్లేట్ల విషయంలో ఇకపై ‘క్యూఆర్‌’ ఆధారిత ధ్రువీకరణ తప్పనిసరి. కేంద్ర మోటారు వాహన నిబంధనల ప్రకారం ఈ కొత్త విధానం ఈ నెల 20 నుంచి అమల్లోకి రానుంది.
  • ఇకపై అన్నీ అధిక లోడ్‌ ట్రాన్స్‌ ఫార్మర్లే [ 17-02-2026] నగరంలో ఇప్పటివరకు 100కేవీఏ, 160 కేవీఏ సామర్థ్యం కల్గిన పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు(డీటీఆర్‌) ఎక్కువగా కన్పించేవి. అధిక లోడు ఉన్న కొన్ని ప్రాంతాల్లో మాత్రమే 315కేవీఏ, 500కేవీఏ ఏర్పాటు చేసేవారు. రాబోయే రోజుల్లో ఎక్కువగా వీటినే ఏర్పాటు చేయబోతున్నారు.
  • హైదరాబాద్‌ వీధుల్లో స్మార్ట్‌ పార్కింగ్‌ [ 17-02-2026] నగరంలో నిత్యం వేలమంది ఎదుర్కొంటున్న పార్కింగ్‌ సమస్యకు ‘స్మార్ట్‌ పార్కింగ్‌ ఆన్‌ స్ట్రీట్స్‌’ ప్రాజెక్టుతో జీహెచ్‌ఎంసీ పరిష్కారం చూపనుంది. మైజీహెచ్‌ఎంసీ మొబైల్‌ యాప్‌లో ప్రత్యేక లింకును అందుబాటులోకి తీసుకొచ్చి..
  • కంట్లో టాటూ.. అతిపెద్ద పొరపాటు [ 17-02-2026] శరీరంపై టాటూలు వేసుకోవడం చాలామంది యువతకు ఇష్టమైన ఫ్యాషన్‌. కాళ్లు, చేతులు, పొట్ట, ఛాతీ, మెడ...ఇలా ఎక్కడ పడితే అక్కడ టాటూలతో హంగామా చేస్తుంటారు.
  • కల నెరవేరింది.. ఆనందం దరిచేరింది [ 17-02-2026] వికారాబాద్‌ పుర ఎన్నికల్లో పోటీ చేసి ముగ్గురు మహిళలు విజయం సాధించడమే కాకుండా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. వీరిలో ఇద్దరు మొదటి సారి బరిలోకి దిగడం విశేషం.
  • నైజీరియన్ల అనధికార నివాసం... 25 మంది పట్టివేత [ 17-02-2026] టోలిచౌకి ఠాణా పరిధిలోని పారామౌంట్, ఐఏఎస్‌కాలనీల్లో పోలీసులు సోమవారం రాత్రి కట్టడిముట్టడి నిర్వహించారు. ఈ సందర్భంగా వీసా గడువు ముగిసినా అక్రమంగా ఇక్కడ నివాసముంటున్నారనే అనుమానంతో నైజీరియన్, సూడాన్, సోమాలియన్, ఇథియోపియా దేశాలకు చెందిన 25 మందిని అదుపులోకి తీసుకున్నారు.
  • మహిళ హత్య.. పూజారికి యావజ్జీవ ఖైదు [ 17-02-2026] బంగారు నగల కోసం దేవాలయానికి వచ్చిన మహిళను హత్యచేసిన పూజారి మురళీకృష్ణకు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష, రూ.7 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.
  • పాత నాణెం పంపిస్తే రూ.57 లక్షలిస్తా [ 17-02-2026] రూ.10 పాత నాణెం పంపిస్తే రూ.57 లక్షలు ఇస్తానంటూ సైబర్‌ నేరగాళ్లు సెంట్రింగ్‌ కార్మికుడి నుంచి రూ.1.67 లక్షలు కొట్టేశారు.
  • ఇంట్లోనే మృతదేహం.. అడిగితే ఆగ్రహం [ 17-02-2026] నాలుగు రోజులుగా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా ఇంట్లోనే ఉంచి.. ప్రార్థనలు చేస్తున్నామంటూ వింతగా మాట్లాడిన కుటుంబంపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
  • ఖాళీ బిస్కెట్‌ ప్యాకెట్లలో డ్రగ్స్‌.. ముగ్గురి అరెస్టు [ 17-02-2026] తిని పారేసిన ఖాళీ బిస్కెట్‌ ప్యాకెట్లలో డ్రగ్స్‌ నింపి డెడ్‌ డ్రాప్‌ విధానంలో విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును తెలంగాణ ఈగల్‌ ఛేదించింది.
  • రాజధానిలో ఆ రౌడీషీటర్ల జాడెక్కడ! [ 17-02-2026] తెరవెనుక ఉంటూ బెదిరింపులు.. కుటుంబ తగాదాల్లో తలదూర్చి పంచాయితీలు.. ఆధిపత్యం సంపాదించేందుకు అక్రమ ఆయుధాలు.. అర్ధరాత్రి దాటాక హోటళ్ల వద్దకు చేరి మంతనాలు..
  • చదువు పక్కన పెట్టి చోరీకి స్కెచ్‌ [ 17-02-2026] బుద్ధిగా చదువుకోవాల్సిన విద్యార్థులు అడ్డదారి తొక్కారు. తాము చదువుతున్న విద్యాసంస్థలోనే 60 ల్యాప్‌టాప్‌లను అపహరించి, పోలీసులకు చిక్కారు.
  • నీటి గంట మోగాలి.. గుటుక్కుమనాలి [ 17-02-2026] విద్యార్థినులు, మహిళల్లో యూరినరీ ట్రాక్‌ ఇన్‌ఫెక్షన్లు (యూటీఐ) సమస్యలు పెరుగుతున్నాయి. అకడమిక్‌తో పాటు వివిధ పోటీ పరీక్షలు దగ్గర పడుతున్నాయి. విద్యార్థినులు గంటల తరబడి తరగతి గదుల్లో ఉంటూ చదువుతున్నారు.
  • జలమండలిలో మేనేజర్‌ సమస్య! [ 17-02-2026] మహా నగరంలో జలమండలి పరిధి విస్తరిస్తుండగా.. సిబ్బంది కొరత అంతకంతకూ పెరుగుతోంది. సేవలు విస్తృతమవుతుండగా.. అందుకనుగుణంగా ఉద్యోగులు, సిబ్బంది లేరు. పౌరసేవలపై తీవ్ర ప్రభావం పడుతోంది.