Zomato CEO Deepinder Goyal: టెంపుల్ డివైజ్‌పై వివాదం.. స్పందించిన జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్‌

Eenadu icon
By Business News Team Published : 10 Jan 2026 00:14 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ (Deepinder Goyal) ఇటీవల తన కణతపై ఒక స్పెషల్‌ డివైజ్‌తో కనిపించారు. దాన్ని టెంపుల్‌ డివైజ్‌ అంటారని కూడా చెప్పారు. ఈ హెల్త్‌ టెక్‌ పరికరంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎయిమ్స్ డాక్టర్లు కూడా ఈ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా దీనిపై దీపిందర్‌ ఎక్స్‌లో వివరణ ఇచ్చారు.

‘‘మా ‘టెంపుల్‌’ (Temple) డివైజ్‌ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. పనితీరు, ప్రమాణాలపై ఎలాంటి డేటా విడుదల చేయలేదు. దీనిని ప్రజల ముందుకు తీసుకురావడానికి కొంత సమయం పడుతుంది. పూర్తిగా పరీక్షించని, ధ్రువీకరించని, ఆమోదం పొందని పరికరాన్ని కొనుగోలు చేయొద్దని కొందరు సూచిస్తుండటం వింతగా ఉంది. డివైజ్‌ను మార్కెట్‌లోకి తీసుకురావాలని మేం భావించినప్పుడు.. దాని వెనక ఉన్న శాస్త్రీయతను వివరిస్తాం. అప్పుడు మీ సూచనలు ఇవ్వండి. అప్పటివరకు ఆసక్తిగా ఎదురుచూడండి. భారత స్టార్టప్‌లను వీలైనంతగా ప్రోత్సహించండి’’ అని దీపిందర్‌ పేర్కొన్నారు. 

  • సుజుకీ ఇ-యాక్సెస్‌ వచ్చేసింది.. ధర రూ.1.88 లక్షలు

టెంపుల్ పరికరం గురించి కొన్ని రోజుల క్రితం గోయల్ ఒక పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు. ఇది మెదడులో రక్తప్రసరణ వివరాలను గుర్తిస్తుందని, ఏదైనా ఒత్తిడి కలిగినప్పుడు శరీరంలో వచ్చే మార్పులను తెలియజేస్తుందని తెలిపారు. శరీర స్థితిగతులను బట్టి మెదడు ఎలా స్పందిస్తుందనేది ముందుగానే పసిగట్టడం వల్ల నివారణ మార్గాలవైపు దృష్టి సారించే వీలు కలిగే అవకాశం ఉందని తెలిపారు. 

► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • లావా నుంచి ఎంట్రీలెవల్‌ స్మార్ట్‌ఫోన్‌.. బోల్డ్‌ ఎన్‌2 ఫీచర్లివే Lava Bold N2: దేశీయ మొబైల్‌ తయారీ సంస్థ లావా తన బోల్డ్‌ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.
  • కోడింగ్‌ కాదు.. ఏఐని ఎలా ఉపయోగించాలనేదే కీలకం! - నందన్‌ నీలేకని కృత్రిమ మేధ అనేది సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ గ్రామర్‌ను తిరిగి రాస్తోందని ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని పేర్కొన్నారు.
  • ఏఐ కళ్లద్దాలతో ప్రధాని మోదీ.. మేడ్‌ఇన్ ఇండియా ‘సర్వం కేజ్‌’ గురించి తెలుసా..? Sarvam AI:  భారత్‌ ఆతిథ్యమిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ ఎక్స్‌పో-2026, సమిట్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి
  • మారుతీ సుజుకీ ఇ-విటారా @ రూ.11 లక్షలు.. బ్యాటరీ EMI ₹3.99km Maruti Suzuki e VITARA: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తన విద్యుత్‌ ఎస్‌యూవీ ఇ-విటారాను (Maruti Suzuki e VITARA) దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది. 
  • గిగ్‌ వర్కర్ల కోసం కర్ణాటక కీలక నిర్ణయం.. వారినుంచి 1 శాతం ఫీజు గిగ్‌ వర్కర్ల సంక్షేమం కోసం కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
  • వీలునామా లేని ఎఫ్‌డీలు.. ఎవరు క్లెయిమ్‌ చేసుకోవచ్చంటే! పెట్టుబడి మార్గాలు ఎన్ని ఉన్నప్పటికీ చాలామంది ఫిక్స్‌డ్ డిపాజిట్‌లకే ప్రాధాన్యత ఇస్తారు.
  • రెండో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి.
  • సామాజిక మాధ్యమాల వినియోగంపై వయసుల వారీ పరిమితులు! Social Media: సామాజిక మాధ్యమాల వినియోగంపై వయసుల వారీ పరిమితులు విధించాలని కేంద్రం యోచిస్తోంది. ఇందులో భాగంగా ఆయా టెక్‌ కంపెనీలతో (సామాజిక మాధ్యమాలు) చర్చలు జరుపుతోంది.
  • డేటా సెంటర్లపై 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి: అదానీ గ్రూప్‌ Adani Group: గౌతమ్‌ అదానీకి చెందిన వ్యాపార సంస్థ అదానీ గ్రూప్‌ (Adani Group) ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) రంగంలో భారీ పెట్టుబడి ప్రకటించింది.
  • ఆరోగ్యబీమా క్లెయిమ్‌ తిరస్కరణ.. వైరల్‌ పోస్ట్‌పై స్పందించిన స్టార్‌ హెల్త్‌ Star Health: వైద్యపరంగా ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ఆదుకుంటుందన్న ఉద్దేశంతో చాలామంది ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటారు. అదే పాలసీ అవసర సమయంలో అక్కరకు రాకపోతే..?
  • ఆంథ్రోపిక్‌తో ఇన్ఫీ జట్టు.. ఐటీ షేర్ల జంప్‌ IT Stocks: కృత్రిమమేధ ‘ఆంథ్రోపిక్‌’ భయాలతో గతవారం తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురైన భారత ఐటీ కంపెనీల షేర్లు.. మంగళవారం కోలుకున్నాయి.
  • ఏఐ ఇంపాక్ట్‌ సదస్సుకు బిల్‌గేట్స్‌ దూరం.. ఎప్‌స్టీన్ వ్యవహారమే కారణమా..? Bill Gates: బిల్‌గేట్స్ ఏఐ సమ్మిట్‌కు హాజరుకావడం లేదని తెలుస్తోంది. 
  • తొలి ట్రిలియనీర్‌గా మస్క్‌? రికార్డు దిశగా కుబేరుడు Elon Musk: ఈ ఏడాదిలో మస్క్ ట్రిలియనీర్‌గా మారే అవకాశం ఉంది. 
  • చలామణిలో రూ.40 లక్షల కోట్ల నగదు దేశంలో డిజిటల్‌ చెల్లింపుల విప్లవం కొనసాగుతున్నా, ప్రజల చేతుల్లో నగదు వినియోగమూ అదే స్థాయిలో పెరుగుతోంది.
  • ఉద్యోగం ఉండాలంటే ఏఐ టూల్స్‌ నేర్చుకోండి కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా ఉద్యోగాలు పోతున్నాయని ఆందోళన చెందుతున్న సాఫ్ట్‌వేర్‌  ఉద్యోగులకు భరోసానిచ్చే సలహాను టెక్‌ పరిశ్రమ దిగ్గజాలు సూచిస్తున్నారు. ‘ప్రశాంతంగా ఉండండి, నైపుణ్యాలు పెంచుకోండి’ అని తెలిపారు.
  • మన వ్యవసాయ రంగానికి రూ.36 లక్షల కోట్ల అవకాశాలు అమెరికా, ఐరోపా సమాఖ్య (ఈయూ)తో కుదిరిన వాణిజ్య ఒప్పందాల కారణంగా, భారత వ్యవసాయ రంగానికి 400 బి. డాలర్ల (దాదాపు రూ.36 లక్షల కోట్ల) అవకాశాలు లభించగలవని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.
  • రాణించిన బ్యాంకింగ్, విద్యుత్‌ షేర్లు విద్యుత్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్ల రాణింపుతో సోమవారం స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. అమెరికా- ఇరాన్‌ చర్చల ప్రభావంతో, అంతర్జాతీయంగా చమురు ధరలు సానుకూలంగా కదలాడటం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలోపేతం చేసింది.
  • 2035కు రూ.215 లక్షల కోట్ల రిటెయిల్‌ విపణి మన దేశ భారత రిటెయిల్‌ రంగ విపణి పరిమాణం 2035 నాటికి రూ.210-215 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని ఓ నివేదిక తెలిపింది. 2025లోని రూ.90- 95 లక్షల కోట్ల స్థాయితో పోలిస్తే, ఈ విలువ రెట్టింపు కంటే ఎక్కువ.
  • టోకు ధరలూ పెరిగాయ్‌ టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా మూడో నెలా పెరిగి, జనవరిలో 1.18 శాతంగా నమోదైంది. ఆహార, ఆహారేతర ఉత్పత్తులు, తయారీ వస్తువులు ప్రియం కావడం ఇందుకు కారణం.
  • స్నాప్‌డీల్‌పై రూ.5 లక్షల జరిమానా భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్‌) ధ్రువీకరణకు అనుగుణంగా లేని బొమ్మలు విక్రయించినందుకు, 2020 టాయ్స్‌ (నాణ్యతా నియంత్రణ) ఆర్డర్‌ను ఉల్లంఘించినందుకు..