మూడు కార్పొరేషన్లుగా పాలన షురూ

Eenadu icon
By Telangana Dist. Desk Updated : 04 Jan 2026 05:15 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఈనాడు, హైదరాబాద్‌: అధికారికంగా జీహెచ్‌ఎంసీ మూడు మహా నగరపాలక సంస్థలుగా ఏర్పాటు కాలేదుగానీ.. పరిపాలన మాత్రం పట్టాలెక్కింది. మూడు జోన్లకు ఓ అదనపు కమిషనర్‌ చొప్పున నియమించిన ఆ ఇద్దరు అధికారులకు శనివారం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ.కర్ణన్‌ పరిపాలన బాధ్యతలపై పూర్తి స్పష్టత ఇచ్చారు. మీకు కేటాయించిన జోన్లకు సంబంధించిన పరిపాలన వ్యవహారాలను.. చక్కదిద్దుకోవాలని, జోనల్‌ కమిషనర్లతో పని చేయించుకోవడం మీ బాధ్యతే అని టెలికాన్ఫరెన్స్‌లో సూచన చేశారు. కొనసాగింపుగా.. ఆయా జోన్ల పరిపాలన, ఆర్థిక, టౌన్‌ప్లానింగ్‌ విభాగాలకు ఉన్నతాధికారులను నియమించారు. 

త్వరలో ఉత్తర్వులు.. ప్రస్తుతం 12 జోన్లు, వాటి పరిధిలో 60 సర్కిళ్లు ఉన్నాయి. ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పరిధి శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, ఖైరతాబాద్, గోల్కొండ, సికింద్రాబాద్‌ జోన్లకు పరిమితం కానుంది. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌ జోన్లతో గ్రేటర్‌ సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీసీఎంసీ), మల్కాజిగిరి, ఎల్బీనగర్, ఉప్పల్‌ జోన్లతో గ్రేటర్‌ మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీఎంఎంసీ) ఏర్పాటవుతాయని తెలుస్తోంది. జీసీఎంసీ పరిధికి ప్రస్తుత అదనపు కమిషనర్‌ సృజన, జీఎంఎంసీ పరిధి అదనపు కమిషనర్‌ వినయ్‌కృష్ణారెడ్డిని కమిషనర్లుగా నియమిస్తూ పాలకమండలి పూర్తయ్యాక ఉత్తర్వు వెలువడుతుందని సమాచారం.

నిర్మాణ అనుమతులు అక్కడి నుంచే..నూతన గ్రేటర్‌ కార్పొరేషన్ల టౌన్‌ప్లానింగ్‌ వ్యవహారాల నిర్వహణను ఇద్దరు డైరెక్టర్‌ హోదాలోని అధికారులకు అప్పగిస్తూ కమిషనర్‌ కర్ణన్‌ ఉత్తర్వు జారీ చేశారు. ఇకపై.. ఆయా జోన్ల పరిధిలోని నిర్మాణ అనుమతుల దరఖాస్తులు వారి ద్వారానే కమిషనర్‌ అనుమతికి వెళ్లనున్నాయి.

20శాతం ఖాళీల భర్తీకి:విలీనంతో 300 డివిజన్ల పరిధిలోని నగరానికి 20శాతం మేర ఉద్యోగుల కొరత ఉంది. టౌన్‌ప్లానింగ్, పారిశుద్ధ్య విభాగాల్లో ఎక్కువ ఖాళీలు ఉన్నాయని అధికారులు లెక్క తేల్చారు. మరో 1,500 మంది  అవసరమని, ఉన్నతాధికారులతో కమిటీ వేయాలని నిర్ణయించారు. 

► Read latest Hyderabad Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 04 Jan 2026 02:07 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • మా పూర్వీకులు తప్పు చేశారు.. క్షమించండి: విజయేంద్రప్రసాద్‌ [ 18-02-2026] ‘మాది సంపన్న కుటుంబం.. అయితే నాకు తెలిసీ ఎప్పుడూ తప్పు చేయలేదు.. మా పూర్వీకులు అంటరానితనం పేరుతో నోటితో చెప్పలేని భయంకరమైన దారుణాలు చేశార’ని ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్‌ పేర్కొన్నారు.
  • నిరీక్షణ జాబితాలో ఉన్నా.. టికెట్‌ పక్కా! [ 18-02-2026] రైల్వే ప్రయాణికుల ‘బెర్త్‌ కన్ఫర్మేషన్‌’ అవకాశాలు పెంచే ‘వికల్ప్‌’ని ఎక్కువ మంది వినియోగించుకోవాలని రైల్వే సూచిస్తోంది.
  • పీఠముడి [ 18-02-2026] 24 వార్డులున్న ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో భారాస 13 స్థానాలు, కాంగ్రెస్‌ 8, భాజపా 2 స్థానాల్లో గెలవగా.. ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. సోమవారం 23 మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు.
  • రీల్స్‌తో ఆకట్టు.. ఖాతాలు కొల్లగొట్టు [ 18-02-2026] చేతిలో సెల్‌ఫోన్‌ ఉంటే చాలు.. ఫేస్‌బుక్, ఇన్‌స్టా, టెలిగ్రామ్, ఎక్స్, వాట్సప్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టే అంశాలను వెతుకుతారు. ఇన్‌ఫ్ల్యూయెన్సర్ల వీడియోలు.. ప్రముఖులు పంచుకునే అంశాల్లో మునిగిపోతుంటారు.
  • అంధులకు ఆసరా... గర్భిణులకు భరోసా [ 18-02-2026] మాదాపూర్‌ హైటెక్స్‌లో మంగళవారం ప్రారంభమైన బయోఏషియా-2026 సదస్సులో పలు ఆవిష్కరణలు ఆసక్తి రేకెత్తించాయి. రోడ్డు దాటేందుకు అంధులకు ఉపయోగపడేలా, గర్భంలో శిశువు ఎదుగుదలను తెలియజెప్పి గర్భిణులకు భరోసాగా నిలిచేలా..
  • సోషల్‌ మీడియా మత్తులో పడి.. పోలీసులకు చిక్కి [ 18-02-2026] సోషల్‌ మీడియా మత్తులో పడి లైక్‌ల కోసం దేవుడి ముందు మత్తు పదార్థాలను ప్రసాదంగా చూపుతూ రీల్స్‌ చేసిన ఇద్దరు యువకులు పోలీసులకు చిక్కారు.
  • కడుపులో రాడ్లు దిగిన వ్యక్తికి పునర్జన్మ [ 18-02-2026] ప్రమాదవశాత్తు మేడపై నుంచి కిందపడిన వ్యక్తి కడుపులో రెండు ఇనుపచువ్వలు గుచ్చుకున్నాయి. అరుదైన శస్త్రచికిత్స చేసి ఆ వ్యక్తికి పునర్జన్మను ప్రసాదించారు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు.
  • ఏఐ.. ఆటొమేషన్‌తో వైద్య రంగంలో పెనుమార్పులు [ 18-02-2026] ‘ప్రపంచ ఆరోగ్య ముఖచిత్రం వేగంగా మారిపోతోంది. నిన్నటి వరకూ అసాధ్యమనుకున్న చికిత్సలు నేడు ‘టెక్‌-బయో’ విప్లవంతో సుసాధ్యమవుతున్నాయి.
  • చింతల్‌ సర్కిల్‌ కార్యాలయంలో ఏసీబీ సోదాలు [ 18-02-2026] జీహెచ్‌ఎంసీ చింతల్‌ సర్కిల్‌ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌ వాహీద్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.
  • 36.8 కి.మీ దూరం.. 25 నిమిషాలు [ 18-02-2026] హైదరాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి  ఊపిరితిత్తుల మార్పిడి కోసం మంగళవారం శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి బేగంపేట వరకు మంగళవారం సాయంత్రం ఆర్జీఐఏ ట్రాఫిక్‌ పోలీసులు గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేశారు.
  • పైప్‌లైన్‌ ధ్వంసం.. సెల్లార్లలోకి నీరు [ 18-02-2026] మణికొండలో భారీ పైప్‌లైన్‌ ధ్వంసం కావడంతో పలు కాలనీల్లోని అపార్టుమెంట్ల సెల్లార్లలోకి పెద్దఎత్తున వరదనీరు చేరింది.
  • మరో ప్రీలాంచ్‌ మోసం [ 18-02-2026] రాజధానిలో భారతి బిల్డర్స్‌ సంస్థ మరో ప్రీలాంచ్‌ మోసం బయటపడింది. ‘రెండేళ్లలో మీ పెట్టుబడి రెట్టింపు చేసుకోండి..’అంటూ భారతి బిల్డర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.5.39 కోట్ల డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసింది.
  • భవనాలకూ ఆధార్‌ [ 18-02-2026] ప్రతి మనిషికీ విశిష్ట గుర్తింపు సంఖ్యతో ఆధార్‌కార్డు జారీ అయినట్లు.. నగరంలోని ప్రతి భవనానికి కూడా క్యూఆర్‌ కోడ్, విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ కాబోతుంది.
  • హోర్డింగ్‌లపై నిషేధం ఎత్తివేత! [ 18-02-2026] నగరంలో మళ్లీ హోర్డింగ్‌లు ఏర్పాటు కాబోతున్నాయి. ప్రజల భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్నాయనే కారణంతో గత సర్కారు..
  • త్వరలో జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో.. ఏఐ చాట్‌బాట్‌ [ 18-02-2026] నిర్మాణ అనుమతికి దరఖాస్తు చేసుకోవడం ఎలా, జనన, మరణ ధ్రువపత్రాలు పొందాలంటే ఏయే పత్రాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి తదితర సందేహాలను నివృత్తి చేసుకునేందుకు అధికారుల వద్దకు వెళ్లనక్కర్లేదు.
  • నిబంధనలకు విరుద్ధంగా అధిక బిల్లు [ 18-02-2026] కొవిడ్‌-19 చికిత్స పేరుతో అధిక బిల్లు వసూలు చేసిన  ఓల్డ్‌ బోయిన్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిని హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌-2 మందలించింది.
  • భార్య చికెన్‌ వండలేదని విశ్రాంత ఉద్యోగి ఆత్మహత్య [ 18-02-2026] అతడో డిఫెన్స్‌ విశ్రాంత ఉద్యోగి.. చికెన్‌ తీసుకుని ఇంటికెళ్లాడు.. ఘుమఘుమలాడే చికెన్‌ కూర వండాలని భార్యకు చెప్పాడు.. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.
  • సిటీ ఏసీ బస్సుల్లో 30% ఛార్జీల తగ్గింపు! [ 18-02-2026] నగరంలో ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. మార్చి నుంచి ఎండలు తీవ్రం కానున్న నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సు ఛార్జీల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.