కూతురి కాపురాన్ని చక్కదిద్దేందుకు వెళ్లి..

Eenadu icon
By Telangana Dist. Desk Updated : 03 Jan 2026 22:04 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

కొవ్వూరు పట్టణం: కూతురి కాపురాన్ని చక్కదిద్దేందుకు వెళ్లి సమన్వయం కుదరదని తెలిసి ఆమె, మనుమరాలితో కలసి చనిపోవాలకున్న ఓ తల్లి గోదావరిలో దూకి గల్లంతైంది. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం రోడ్‌కం రైలు వంతెనపై చోటుచేసుకుంది. బాధితులు, స్థానికుల వివరాల ప్రకారం.. దేవరపల్లి మండలం దుద్దుకూరుకు చెందిన ఈగల ధనలక్ష్మి(40) తన కుమార్తె విజయకుమారిని మండపేటకు చెందిన బూసాల విజయ్‌కుమార్‌కు ఇచ్చి 2020లో వివాహం చేశారు. వారికి నాలుగేళ్ల కుమారుడు మోక్షిత్, ఏడాదిన్నర కుమార్తె లక్ష్మీప్రసన్న ఉన్నారు. లారీ డ్రైవరుగా పని చేసే వినయ్‌కుమార్‌ భార్యను వేధిస్తున్నాడని, మనస్పర్థల కారణంగా కొన్నాళ్లుగా ఘర్షణ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ధనలక్ష్మి శుక్రవారం ఉదయం మండపేట వెళ్లారు. గొడవలు జరగడంతో కుమార్తె, మనుమరాలితో కలిసి మధ్యాహ్నం బయటకు వచ్చేశారు. ఆ సమయంలో మనుమడు పాఠశాలకు వెళ్లాడు. ముగ్గురూ రాజమహేంద్రవరం వచ్చి గోదావరిలో దూకాలని నిర్ణయించుకున్నారు. ఆటోలో వంతెనపైకి వచ్చారు. కొంతదూరం నడిచాక ఉన్నట్లుండి ధనలక్ష్మి గోదావరిలో దూకారు. ఆ వెంటనే విజయకుమారి దూకబోగా స్థానికులు అడ్డుకున్నారు. కొవ్వూరు పట్టణ పోలీసులు వెళ్లి రోదిస్తున్న విజయకుమారి, చిన్నారిని స్టేషనుకు తీసుకొచ్చారు. గల్లంతైన ధనలక్ష్మి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వాహన రాకపోకలు అరగంట పాటు నిలిచిపోయాయి. పోలీసులు వచ్చి ట్రాఫిక్‌ను క్రమబద్ధీరించారు.

నా వల్లే అమ్మకు ఇంత కష్టం..

నేను బాగుండాలని, కుటుంబాన్ని చక్కదిద్దాలని అమ్మ కోరుకునేది. ముగ్గురం చనిపోవాలని అనుకున్నా అమ్మ నా కళ్ల ముందే గోదావరిలో దూకి గల్లంతైంది. ఇప్పుడు నేనేం చేయాలంటూ విజయకుమారి ఆవేదన చెందుతోంది. అభం శుభం తెలియని చిన్నారి చూపులు అక్కడ ఉన్న అందరినీ కలచివేశాయి. 

► Read latest Polavaram Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 03 Jan 2026 07:39 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • లక్ష్యాన్ని మించేలా.. ఉత్పత్తి పెంచేలా [ 17-02-2026] దిగువ సీలేరు ప్రాజెక్టులోని పొల్లూరు జలవిద్యుత్కేంద్రంలో రూ.510 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న 5, 6 యూనిట్ల అనుసంధాన పనుల్లో భాగంగా 48 రోజులపాటు విద్యుదుత్పత్తి నిలిపి, తిరిగి ప్రారంభించిన పొల్లూరు జలవిద్యుత్కేంద్రం లక్ష్య సాధన దిశగా విద్యుదుత్పత్తి చేస్తుంది.
  • నేటి నుంచి సీబీఎస్‌ఈ పరీక్షలు [ 17-02-2026] విద్యార్థి జీవితంలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఎంతో కీలకం. ఇందులో భాగంగా ఏకలవ్య మోడల్‌ గురుకుల విద్యాసంస్థల్లో (ఈఎంఆర్‌ఎస్‌) నేటి నుంచి పదోతరగతి, 20 నుంచి ఇంటర్‌ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలు జరగనున్నాయి.
  • సీఎం దృష్టికి పోలవరం జిల్లా సమస్యలు [ 17-02-2026] కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లాకు క్షేత్రస్థాయిలో దీర్ఘకాలికంగా వెంటాడుతున్న సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి.. స్పష్టమైన హామీలు పొందినట్లు రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి తెలిపారు.
  • కనుల పండువగా రథోత్సవం [ 17-02-2026] మహాశివరాత్రి ఉత్సవాలు సందర్భంగా సామర్లకోట భీమేశ్వరస్వామి వారి రథోత్సవం సోమవారం కనుల పండువగా సాగింది. ఉత్సవ అధికారి నాగేశ్వరరావు, ఆలయ ఈవో నీలకంఠం, ట్రస్టుబోర్డు ఛైర్మన్‌ జగదీష్‌మోహన్‌ ఆధ్వర్యంలో ఉదయం స్వామి, అమ్మవార్లకు దూప సేవ నిర్వహించారు.
  • నాలుగేళ్లయినా.. వంతెన ఇంతేనా [ 17-02-2026] వీఆర్‌పురం-చింతూరు ప్రధాన రహదారిపై అన్నవరం వాగుకు నాలుగేళ్ల నుంచి తాత్కాలిక గొట్టాల దారి ఏర్పాటు చేయడం, వర్షాకాలం సమయంలో వాగులోని వరద ఉద్ధృతికి అది కొట్టుకుపోవడం, ప్రజలు ఇబ్బందులు పడటం పరిపాటిగా మారింది.
  • గోదావరి వరద అధ్యయనానికి ఇస్రో శాస్త్రవేత్తలు [ 17-02-2026] ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని గోదావరి నది వరద ప్రభావిత ప్రాంతాల్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఆధ్వర్యంలో పనిచేస్తున్న నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ నెల 18, 19 తేదీల్లో పర్యటించనుంది.
  • వారెవ్వా కోనసీమ.. వాలీబాల్‌ హంగామా.. [ 17-02-2026] జాతీయ స్థాయి పురుషులు, మహిళల వాలీబాల్‌ పోటీలకు ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వేదికైంది.