జీవిత ప్రయాణం

Eenadu icon
By Editorial Team Published : 03 Jan 2026 04:12 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

నిషి జీవితం ఎంతో ఉత్కృష్టమైంది. అమూల్యమైంది. దాని విలువ తెలిసిన మనిషి ప్రతి క్షణాన్నీ సద్వినియోగం చేసుకుంటాడు. తన జీవన గమనాన్ని నిరంతరం పరిశీలించుకుంటాడు. అవసరమైన మార్పులు చేసుకుంటాడు. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలనే ఆశయం ప్రతి మనిషికీ ఉంటుంది. సహజమైన ఈ లక్ష్య సిద్ధి కోసం ప్రయాణించే మార్గం ఎల్లప్పుడూ ధర్మబద్ధంగా ఉండాలి. అది ఇతరులకు మేలు చేసేటట్లు కూడా ఉండాలి.

ఈ జీవిత ప్రయాణంలో ఎన్నో బంధాలు, పరిచయాలు ఏర్పడతాయి. మరెన్నో అనుభవాలు కలుగుతూంటాయి. మనతో కలిసి ప్రయాణించేవారు ఎందరో ఉంటారు. కానీ ఎవరూ శాశ్వతంగా మనతో ఉండరు. అయినా నిరాశపడకూడదు. ధర్మబద్ధమైన నడవడికతో ముందుకుసాగాలి. అదే మనల్ని రక్షిస్తుంది.

మంచి నడవడికతో ముందుకు సాగినా ఒక్కొక్కప్పుడు ఓటమిని కూడా అనుభవించక తప్పదు. విజయానికి పొంగిపోకుండా, పరాజయానికి కుంగిపోకుండా స్థితప్రజ్ఞతతో ముందుకు సాగిన మనిషి మాత్రమే తానాశించిన లక్ష్యాన్ని చేరుకోగలడు. నిజానికి ఈ ప్రపంచంలో ఏ ఒక్కరి జీవిత ప్రయాణమూ సాఫీగా సాగదు. ప్రయాణించే దారి ఎప్పుడూ పూలబాటగానే ఉండదు. ఆ దారిలో ముళ్లుంటాయి. రాళ్లుంటాయి. ఎన్నో ఎత్తుపల్లాలుంటాయి. అందరూ పడుతూంటారు. లేస్తూంటారు. ముందుకు సాగుతుంటారు. కిందపడినా మనోధైర్యంతో పైకి లేచేవాడే విజయం సాధించగలడని భర్తృహరి బోధిస్తాడు.

ఇక మనం ప్రయాణించే దారిలో మన ఉన్నతిని చూసి ఈర్ష్ష్యపడే కళ్లుంటాయి. తప్పుల్ని ఎత్తి చూపించే వేళ్లుంటాయి. వెక్కిరించే నోళ్లు కూడా ఉంటాయి. వీటన్నింటికీ భయపడితే ఎవరూ తాము కోరుకున్న గమ్యం చేరలేరు. కార్యసాధకులకు విఘ్నాలు అనేకం. వాటికి తలవంచి వెనకంజ వేయకుండా, ముందుకు సాగితేనే కలలు సాకారమవుతాయి.

జీవనగమనంలో కష్టనష్టాలను మౌనంగా భరించడం; ఓటమిని, అవమానాలను హుందాగా స్వీకరించడం వంటివి ధీర గంభీర వ్యక్తిత్వానికి నిదర్శనాలు. చక్రవర్తి కావాల్సిన శ్రీరాముడు తండ్రి మాటకి తలవంచి అరణ్యాలకు వెళ్లాడు. కారుణ్యమూర్తిగా, ఆదర్శపురుషుడిగా అందరి మన్ననలు పొందాడు. చివరికి రావణ సంహారం చేసి అవతార లక్ష్యాన్ని పూర్తిచేశాడు. పదమూడేళ్లు అరణ్యవాసం, సంవత్సరం అజ్ఞాతవాసం చేయాల్సివచ్చినా పాండవులు ధర్మాన్ని వీడక ముందుకు సాగారు. జీవితం అన్నాక కష్టసుఖాలు పడుగూ పేకల్లా అల్లుకుని ఉంటాయి. ఎంతటివారైనా వాటిని అనుభవించక తప్పదు.

ముళ్ల మధ్య ఉన్నా పువ్వులు ప్రసన్నంగా వికసిస్తూ, పరిమళాలు అందిస్తూ అందరికీ ఆనందాన్ని కలిగిస్తాయి. అదే రీతిగా మనిషి కూడా అడ్డంకులను అధిగమించి తన బాధ్యతలను సక్రమంగా, ధర్మబద్ధంగా నిర్వహిస్తే జీవితం అర్థవంతంగా, ఆదర్శప్రాయంగా సాగుతుంది. ఇతరులు తమను గుర్తించాలని ఆడంబరంగా బతకడం కన్నా సద్భావనలతో అందరికీ సహాయ, సహకారాలందించే వాళ్లే గొప్పవాళ్లు. ‘పరోపకారార్థం ఇదం శరీరం’ అన్న నీతివాక్యాన్ని అనుసరించి దయ, ప్రేమ, సహకార గుణాలతో పయనం సాగించాలి. అప్పుడే జీవితం ధన్యమవుతుంది.

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • జీవితమే సందేశం పాలూ నీళ్లను వేరు చేసేదిగా హంసకు పేరు. భౌతిక సుఖాలను, కష్టాలను సమ స్థితిలో అనుభవించేలా చేయగలిగే వైరాగ్య భావనలను ప్రబోధించిన వారు పరమహంస. శ్రీరామకృష్ణులు ఆచరణయోగ్యమైన ఆధ్యాత్మిక తత్వానికి నిలువెత్తు నిదర్శనం. కలకత్తాలోని దక్షిణేశ్వర్‌ కాళికా ఆలయంలో పూజారిగా ఉంటూ ఎంతోమందికి జ్ఞానభిక్ష అందించారు.
  • యాదగిరీశా నమోస్తుతే! బ్రహ్మ, విష్ణు, రుద్ర సమన్వయ శక్తులతో సృష్టి, స్థితి, లయాత్మకమైన చైతన్య స్వరూపమే నృసింహాకృతి! శ్రీహరి దశావతారాల్లో నరసింహ రూపం విశేషమైనది. నృసింహావతారం ఎంత ప్రచండమో, అంత ప్రహ్లాదం. ఎంత ప్రళయత్వమో అంత ప్రసన్నం.
  • దూరదృష్టి ‘రాబోవు నాపదలను/ లేబోనీయకయె ముందు తెలిసి మెలంగున్‌/ ప్రాబల్యము గలవాడే/ శోభిలు నిల నతడె’ అంటూ దూరదృష్టితో మెలిగితే ఆపదలను తప్పించుకోగలరని వర్ణించాడొక కవి. దూరదృష్టితో వ్యవహరించడమంటే, భవిష్యత్తును ఊహించగలిగే శక్తిగా భావించకూడదు.
  • శరణం శరణం... శంకరం మహాశివరాత్రి లోతైన ఆధ్యాత్మిక పరమార్థం ఉన్న పండుగ. ‘శివ’ అంటే అక్షరాలా కల్యాణకారి. మహాశివరాత్రి నిరాకార స్వరూపుడైన ఆ మహాశివుడి దివ్య కార్యాలను స్మరించుకుంటూ, పరమేశ్వరుడికి ప్రణమిల్లే సుదినం.
  • తపస్సు భగవంతుడి సాక్షాత్కారం కోసం తపస్సు ప్రధానమైన సాధనమన్నది దైవజ్ఞులు చెప్పే మాట. అది అంత సులభమైనది కాదు. ధ్రువుడు, ప్రహ్లాదుడు వంటి వారు నిష్ఠతో, తదేక దీక్షతో దాన్ని ఆచరించి చిరంజీవులుగా ఖ్యాతి పొందారు.
  • మాటే మంత్రం తల వెనక తలంత బలగం ఉన్నా ఒక్కరూ కష్టకాలంలో ఆదుకోలేదు... అంటారు. ఈ కాలంలో ఎంతటి సంపదనైనా ఆర్జించవచ్చు కానీ కష్టంలో మనకోసం నిలబడేవారిని సంపాదించుకోవడం కష్టమే. అలా సంపాదించుకోవడం మన ప్రవర్తన, సంస్కారం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కత్తికన్నా పదునైంది నాలుక.
  • మహోన్నత సంస్కర్త ప్రథమ స్వాతంత్య్ర సమరానికి అజ్ఞాతంగా బీజావాపన చేసిన యోధ, భారతీయులు పరపీడన నుంచి బయటపడి ఉజ్వల భవిష్యత్తు గల జాతిగా నిలవడానికి సహస్ర విధాలుగా పరిశ్రమించిన మహామనీషి, సంఘంలోని దురాచారాలను ఖండించి జనంలో ఆత్మవిశ్వాసానికి పాదుకొల్పిన తపస్వి స్వామి దయానందులు.
  • అమూల్య వరం మనిషి ముఖం నుంచి ‘అగ్ని’ వాగ్రూపంలో వెలువడుతోందని ఐతరేయోపనిషత్తు పేర్కొంటోంది. మాట అగ్ని అంతటి పవిత్రమైనదీ ప్రమాదకరమైనదీ కూడా.
  • సంకల్ప బలం మనిషి జీవితంలో సుఖాలు, దుఃఖాలు, విజయాలు, వైఫల్యాలు అనే కొండలను, లోయలను ఎక్కుతూ దిగుతూ ముందుకు పయనించాల్సిందే! నిజానికి ఒక వ్యక్తి తన లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన ప్రాథమిక ఇంధనం ఏమై ఉంటుందీ అంటే- సంకల్ప బలం అని చెప్పొచ్చు.
  • దాన ఫలం! సర్వ ప్రాణుల పట్ల దయ ఉన్నవారిని దైవిక లక్షణాలు కలిగినవారిగా చెబుతారు. పవిత్ర భావనలతో, నిస్వార్థంతో జీవించేవారిని తాను వెన్నంటి ఉంటానంటాడు పరమాత్ముడు గీతలో.
  • ఎవరు గొప్ప? నన్ను మించిన వారెవరూ లేరు అనే అహంభావం వల్ల మనుషుల మధ్య గొడవలు జరగడం సహజమే. కానీ మునులు, మహాపురుషులు, దేవతలు సైతం వాటి ప్రభావంలో పడి, తరవాత పశ్చాత్తాపం చెందడం ఆశ్చర్యపరుస్తుంది.
  • అజ్ఞానాన్ని రూపుమాపాలి! ఆదిశంకరుడు చెప్పిన అజ్ఞానం వేరు. ఈ అజ్ఞానం అది కాదు. అంతటా వ్యాపించి రాజ్యమేలుతున్న ఈ అజ్ఞానమే అధర్మానికి, అన్యాయానికి కూడా కారణం.
  • పంచ సూత్రాలు భూమి నిశ్చలంగా ఉన్నట్లు కనిపించినా, అది ప్రతిక్షణం చలనంలో ఉంటుంది. మరి ఈ స్థిరత్వం ఎక్కడి నుంచి వస్తోంది? పురాణాల ప్రకారం, భూమిని నాలుగు దిగ్గజాలు (ఐరావతాలు) మోస్తున్నాయి.
  • భక్తి - ధర్మం భక్తిభావం, ధర్మగుణం కలిగినవారే మనకు మార్గదర్శకులు, పురాణపురుషులు అయ్యారు. భక్తి వేరు, ధర్మగుణం వేరు. ధర్మగుణంలేని భక్తి శోభించదు, జయించదు.
  • గురుబ్రహ్మ... భౌతిక ప్రపంచంలో వినోద, విహారాలతో సంతృప్తి చెందుతున్నంతవరకు ఆధ్యాత్మిక లోకంలో విహరించాలనే ఆలోచన రాదు. ప్రాపంచిక సుఖాలే శాశ్వతమన్న భ్రమలో ఉండి దారితెన్నులు తెలియని వారికి భగవత్సన్నిధికి దిశానిర్దేశం చేసే వ్యక్తి గురువు. 
  • సృష్టికి మార్గదర్శకుడు సృష్టి... యాదృచ్ఛికంగా నడిచే ప్రక్రియ కాదు. దానికి ఒక క్రమం ఉంది, నియమం ఉంది, ధర్మం ఉంది. ఆ ధర్మానికి దిశానిర్దేశం చేసే శక్తే శ్రీకృష్ణుడు. ఆయన ద్వాపర యుగ అవతార పురుషుడు మాత్రమే కాదు. కాలం, దేశం, పరిస్థితులను దాటి నిలిచిన పరమసత్యానికి సాకార రూపం. సృష్టి ఎలా సాగాలి, జీవితం ఎలా నడవాలి అనే ప్రశ్నలకు సమాధానంగా నిలిచిన తత్వమే కృష్ణుడు.
  • జ్ఞానాయుధం జ్ఞానం మనిషి వికాసానికి మూలాధారం. అది అంధకార మార్గంలో వెలుగులను ప్రకాశింపజేసే దివ్యజ్యోతి. వ్యక్తి ఉనికే ఙ్ఞానం... అంటాడు దక్షిణామూర్తి.
  • ఏది హింస? ‘అహింసా పరమోధర్మః’ అన్నారు పెద్దలు. అంటే హింస చేయకుండా ఉండటమే గొప్ప ధర్మమని అర్థం. హింస అంటే శారీరకంగా బాధించడమో, చంపడమో అని మాత్రమే అర్థంకాదు. ఎదుటివారిని మానసికంగా క్షోభకు గురిచేసినా అది హింస కిందకే వస్తుంది. శరీరానికి బాణాలు గుచ్చుకున్నా ఉపాయంతో తీసి వేయవచ్చు, ఆ గాయాలు మందులతో కొంత కాలానికి మానతాయి.
  • సహనం ఒక వరం ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకోవాలన్నా, భౌతికమైన కోరికలు తీర్చుకోవాలన్నా మనిషికి సహనం తప్పనిసరి. నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటూ, నిరంతరం అంకితభావంతో చేసే కృషే- సహనం. అవాంతరాలను ఆత్మస్థైర్యంతో, పట్టుదలతో ఎదుర్కొని; పొగడ్తలకు, విమర్శలకు ప్రాధాన్యమివ్వకుండా చేసే యజ్ఞం అది.
  • కాలం విలువ కాలం ప్రతీ క్షణం ఓ ఇంద్రజాలం. కళ్లముందే మాయమైపోతుంటుంది మరి. కదిలే కాలం అనుకోని విజయాలను, వైభవాలను ఇచ్చినట్లే అప్పుడప్పుడు ఓటమినీ చవిచూపిస్తుంది.