Nitin Gadkari: రోడ్డు విస్తరణలో..మా మామ ఇంటినే తొలగించాం: నితిన్‌ గడ్కరీ

Eenadu icon
By National News Team Published : 04 Jan 2026 00:12 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: పని విషయంలో తనకు అందరూ సమానమేనని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Nitin Gadkari) అన్నారు. గతంలో ఒకసారి రోడ్డు విస్తరణ పనులు చేపట్టినప్పుడు అడ్డుగా ఉన్న తన సొంత మామ ఇంటినే తొలగించినట్టు వెల్లడించారు. ప్రముఖ బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ ఫరా ఖాన్‌ (Farah Khan) యూట్యూబ్ వ్లాగ్‌లో కేంద్రమంత్రి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫరా తన కుక్‌ దిలీప్‌తో కలిసి దిల్లీలోని గడ్కరీ నివాసాన్ని సందర్శించారు. ఈ క్రమంలో గడ్కరీ తన సతీమణి కాంచన్‌తో కలిసి ఫరా ఖాన్‌ వ్లాగ్‌లో పాల్గొన్నారు. 

తమ గ్రామంలో రోడ్డు వేయాల్సిందిగా ఫరా ఖాన్‌ కుక్‌ దిలీప్ వ్లాగ్‌లో గడ్కరీని అభ్యర్థించాడు. దీంతో అతడి ఇంటి మీదుగా రోడ్డు వేయాలని ఫరాఖాన్‌ చమత్కరించారు. అక్కడే ఉన్న మంత్రి సతీమణి కాంచన్‌ మాట్లాడుతూ ఒక ఘటనను వెల్లడించారు. రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉందని తన తండ్రి ఇంటినే కూల్చేశారని పేర్కొనడంతో అక్కడి వారు ఆశ్చర్యపోయారు. దీనిపై నితిన్‌ గడ్కరీ ( Nitin Gadkari) వివరణ ఇస్తూ.. గతంలో రోడ్డు విస్తరణ పనుల్లో సొంత మామ ఇంటినే కూల్చివేసినట్లు తెలిపారు. మరి తర్వాత కొత్త ఇల్లు కట్టించారా అని ఫరాఖాన్‌ అడగగా.. ఇల్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం నుంచి అందించే పరిహారం మాత్రమే ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ వ్లాగ్‌లో తన జీవితంలోని పలు ఆసక్తికరమైన విషయాలను కూడా కేంద్రమంత్రి పంచుకున్నారు.  ఇదీ చదవండి: రేహాన్‌ ఎంగేజ్‌మెంట్‌.. ధ్రువీకరించిన ప్రియాంక గాంధీ

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ముంబయిలో మెక్రాన్‌-మోదీ భేటీ Emmanuel Macron India Visit: భారత పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్.. ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు
  • వాష్‌రూమ్‌లో సీక్రెట్‌ కెమెరాలు.. కన్నడ నటి వీడియో రికార్డు చేసి, బ్లాక్‌మెయిల్‌ Kannada actress:  ఒక కన్నడ నటికి చేదు అనుభవం ఎదురైంది. వాష్‌రూమ్‌లో రహస్య కెమెరాలు అమర్చి, ఆ వీడియోతో తనను బ్లాక్‌మెయిల్ చేశారంటూ ఆమె ఆరోపించారు.
  • ఏఐ సదస్సులో సమస్యలు.. కేంద్రమంత్రి క్షమాపణలు ఏఐ సదస్సు జరుగుతున్న భారత మండపం వద్ద సౌకర్యాలు లేవంటూ కొంతమంది ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలోనే కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ క్షమాపణలు తెలిపారు.
  • రీల్‌ చేస్తూ డ్రైవింగ్‌ చేయడం వల్లే.. దిల్లీ ప్రమాదం వీడియో వైరల్‌ ఇటీవల దిల్లీలో జరిగిన కారు ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 
  • కమల్‌హాసన్‌ ‘ఎంఎన్‌ఎం’ పార్టీకి టార్చిలైట్‌ గుర్తు కమల్‌హాసన్‌ మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీకి ఎన్నికల సంఘం టార్చిలైట్‌ గుర్తును కేటాయించింది.
  • ‘ఎంతసేపు చదివామన్నది కాదు’: జేఈఈ మెయిన్‌ టాపర్‌ కబీర్‌ చిల్లర్‌ జేఈఈ మెయిన్‌లో 300కు 300 స్కోర్‌ తెచ్చుకొన్న కబీర్‌ స్థానిక మీడియాతో మాట్లాడారు. జేఈఈలో మంచి మార్కులు సాధించడానికి ఏ విధంగా సన్నద్ధమవ్వాలనే విషయంపై తోటి విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
  • డియర్‌ ఫ్రెండ్‌.. ముంబయిలో కలుద్దాం: మెక్రాన్‌కు ప్రధాని మోదీ స్వాగతం Emmanuel Macron India Visit: భారత పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్‌ను ప్రధాని మోదీ స్వాగతించారు.
  • ప్రియురాలి ప్రాణం తీసి.. ఆపై తాంత్రిక పూజలు..! ఇటీవల ఇందౌర్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఎంబీఏ విద్యార్థిని కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
  • మేక పాలతో సబ్బులు మేకపాలతో సబ్బులు తయారు చేస్తూ గ్రామీణ ప్రాంత మహిళలు ఉపాధి పొందుతున్నారు.
  • ఈ శివలింగం పెరుగుతోంది.. జరుగుతోంది! బిహార్‌లోని నిరంజన నదిలో ఉన్న శివలింగం ఏటా అత్యంత స్వల్పంగా పెరుగుతోందని.. కదులుతోందని స్థానికులు చెబుతున్నారు.
  • నేను రాహుల్‌వాదిని కాదు.. కేరళలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాదు కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ నేతృత్వంలోని వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (ఎల్‌డీఎఫ్‌) విజయం సాధిస్తుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
  • కర్ణాటకలో రూ.400 కోట్ల దారి దోపిడీ కట్టుకథే ఓ ట్రక్కులో హవాలా సొమ్ము తరలిస్తుండగా రూ.400 కోట్ల నగదు దోపిడీ జరిగిందంటూ ఆ వాహన డ్రైవర్‌ చేసిన ఫిర్యాదు బోగస్‌ అని తేలింది.
  • ఏఐ ప్రయాణంలో ముందున్నాం కృత్రిమ మేధ (ఏఐ) రంగంపై విస్తృతంగా చర్చించేందుకు, అత్యాధునిక ఆవిష్కరణలపై అవగాహన కల్పించేందుకు భారత్‌ ఆతిథ్యమిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ ఎక్స్‌పో-2026, సమిట్‌లు సోమవారం దిల్లీలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
  • తొలి దఫా బోర్డు పరీక్షలకు ‘పది’ విద్యార్థుల హాజరు తప్పనిసరి పదో తరగతి విద్యార్థులు మంగళవారం నుంచి నిర్వహించే మొదటి దఫా బోర్డు పరీక్షలు తప్పనిసరిగా రాయాలని సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) స్పష్టం చేసింది.
  • పెళ్లికి ముందు ఎవరినీ నమ్మవద్దు పెళ్లికి ముందే శారీరక సంబంధాలు ఏర్పరచుకునే విషయంలో అబ్బాయిలు, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు సోమవారం హెచ్చరించింది.
  • ‘పరిశ్రమ’ నిర్వచనాన్ని తేల్చేందుకు 9 మంది జడ్జీలతో విస్తృత ధర్మాసనం ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ‘పరిశ్రమ’ నిర్వచనం వివాదంపై 9 మంది జడ్జీలతో కూడిన సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం విచారణ జరపనుంది.
  • 25-26 తేదీల్లో మోదీ ఇజ్రాయెల్‌ పర్యటన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 25-26 తేదీల్లో రెండ్రోజుల పాటు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు.
  • దేశంలోనే అత్యంత పొడవైన తొండ మహారాష్ట్రలోని కొల్హాపుర్‌ జిల్లాలో నిర్వహించిన వ్యవసాయ ప్రదర్శనలో దేశంలోనే అత్యంత పొడవైన తొండ(ఇగ్వానా) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
  • ముచ్చటగా మూడోసారి.. ఐఏఎస్‌తోనే మనువు మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అవీ ప్రసాద్‌ తన పెళ్లితో తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు.
  • సంక్షిప్తవార్తలు (3) ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌ మంగళవారం భారత్‌ పర్యటనకు రానున్నారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబయిలో ఆయనతో సమావేశం అవుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.