TG News: తెలంగాణలో పలువురు ఐఏఎస్ల బదిలీ

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లుగా జి.శ్రీజన, టి.వినయ్ కృష్ణారెడ్డి నియమితులయ్యారు. నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి నిజామాబాద్ కలెక్టర్గా బదిలీ అయ్యారు. నల్గొండ జిల్లా కలెక్టర్గా బడుగు చంద్రశేఖర్, నారాయణపేట అడిషనల్ కలెక్టర్గా ఉమాశంకర్ ప్రసాద్ను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
వాణిజ్య పన్నుల శాఖలో భారీగా బదిలీలు
వివిధ హోదాలకు చెందిన 21 మంది అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాణిజ్య పన్నులశాఖ అధికారులను వివిధ డివిజన్లకు బదిలీ చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. హైదరాబాద్ రూరల్ ఏజేసీగా రాజేశ్ కుమార్, పంజాగుట్ట ఏజేసీగా సుధామల్లు రజిని, సికింద్రాబాద్ ఏజేసీగా శ్రీలక్ష్మి మంగళదీప్తి నియమితులయ్యారు.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 30 Dec 2025 21:45 IST