Crime News: గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌.. బంజారాహిల్స్‌కు చెందిన యువతి అరెస్ట్‌

Eenadu icon
By Telangana Dist. Team Published : 31 Dec 2025 00:09 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

హైదరాబాద్‌: నగరంలో మాదకద్రవ్యాల కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. డ్రగ్స్ పెడ్లర్లు కొత్తదారుల్లో సరఫరా కొనసాగిస్తున్నారు. తాజాగా గోవా నుంచి హైదరాబాద్‌కు భారీగా డ్రగ్స్ తీసుకొస్తున్న యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలిని బంజారాహిల్స్‌కు చెందిన హస్సాగా గుర్తించారు. 2024 డిసెంబరులో గోవా వెళ్లిన ఆమె.. అక్కడ మొదటిసారి MDMA రుచి చూసింది. ఆ తర్వాత మాదకద్రవ్యాలకు బానిసగా మారింది.

కేవలం వినియోగదారురాలిగానే కాకుండా, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశతో డ్రగ్స్ పెడ్లర్‌గా మారినట్లు పోలీసులు వెల్లడించారు. గోవాలో నైజీరియన్ డ్రగ్ మాఫియాతో ఆమె సంబంధాలు ఏర్పచుకున్నట్లు  విచారణలో తేలింది. వారి వద్ద నుంచి తక్కువ ధరకు MDMA, LSD వంటి ఖరీదైన డ్రగ్స్‌ను కొనుగోలు చేసి.. హైదరాబాద్ తీసుకువచ్చి ఇక్కడి యువతకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

ఈ ఏడాది మార్చి నుంచి ఆమె పలుమార్లు గోవాకు వెళ్లి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈనెల 26న సియోలిమ్, మాపూసా ప్రాంతాల్లో ఆమె డ్రగ్స్ డీల్స్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. హస్సా గతంలో కూడా గోల్కొండ పోలీస్ స్టేషన్‌లో NDPS యాక్ట్ కింద కేసు నమోదైంది. ఆ కేసులో జైలుకు వెళ్లిన ఆమె.. ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చింది.

జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా పద్ధతి మార్చుకోకుండా.. మరింత పకడ్బందీగా హైదరాబాద్‌కు చెందిన మరికొందరు సహచరులతో కలిసి డ్రగ్స్ దందా కొనసాగిస్తుండగా పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. నగరంలో ఆమె ఎవరెవరికి డ్రగ్స్ విక్రయిస్తోంది? ఈ ముఠాలో ఇంకా ఎంతమంది సభ్యులు ఉన్నారు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ గొలుసుకట్టు నెట్‌వర్క్‌లో ఉన్న మిగిలిన నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

► Read latest Hyderabad Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికకు లైన్‌ క్లియర్‌ [ 18-02-2026] రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికకు అడ్డంకి తొలగింది. ఛైర్మన్‌ ఎన్నికపై తుది నిర్ణయం ఆర్వోదేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
  • రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి [ 18-02-2026] షాద్‌నగర్‌లో మంగళవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది.
  • మా పూర్వీకులు తప్పు చేశారు.. క్షమించండి: విజయేంద్రప్రసాద్‌ [ 18-02-2026] ‘మాది సంపన్న కుటుంబం.. అయితే నాకు తెలిసీ ఎప్పుడూ తప్పు చేయలేదు.. మా పూర్వీకులు అంటరానితనం పేరుతో నోటితో చెప్పలేని భయంకరమైన దారుణాలు చేశార’ని ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్‌ పేర్కొన్నారు.
  • నిరీక్షణ జాబితాలో ఉన్నా.. టికెట్‌ పక్కా! [ 18-02-2026] రైల్వే ప్రయాణికుల ‘బెర్త్‌ కన్ఫర్మేషన్‌’ అవకాశాలు పెంచే ‘వికల్ప్‌’ని ఎక్కువ మంది వినియోగించుకోవాలని రైల్వే సూచిస్తోంది.
  • పీఠముడి [ 18-02-2026] 24 వార్డులున్న ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో భారాస 13 స్థానాలు, కాంగ్రెస్‌ 8, భాజపా 2 స్థానాల్లో గెలవగా.. ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. సోమవారం 23 మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు.
  • రీల్స్‌తో ఆకట్టు.. ఖాతాలు కొల్లగొట్టు [ 18-02-2026] చేతిలో సెల్‌ఫోన్‌ ఉంటే చాలు.. ఫేస్‌బుక్, ఇన్‌స్టా, టెలిగ్రామ్, ఎక్స్, వాట్సప్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టే అంశాలను వెతుకుతారు. ఇన్‌ఫ్ల్యూయెన్సర్ల వీడియోలు.. ప్రముఖులు పంచుకునే అంశాల్లో మునిగిపోతుంటారు.
  • అంధులకు ఆసరా... గర్భిణులకు భరోసా [ 18-02-2026] మాదాపూర్‌ హైటెక్స్‌లో మంగళవారం ప్రారంభమైన బయోఏషియా-2026 సదస్సులో పలు ఆవిష్కరణలు ఆసక్తి రేకెత్తించాయి. రోడ్డు దాటేందుకు అంధులకు ఉపయోగపడేలా, గర్భంలో శిశువు ఎదుగుదలను తెలియజెప్పి గర్భిణులకు భరోసాగా నిలిచేలా..
  • సోషల్‌ మీడియా మత్తులో పడి.. పోలీసులకు చిక్కి [ 18-02-2026] సోషల్‌ మీడియా మత్తులో పడి లైక్‌ల కోసం దేవుడి ముందు మత్తు పదార్థాలను ప్రసాదంగా చూపుతూ రీల్స్‌ చేసిన ఇద్దరు యువకులు పోలీసులకు చిక్కారు.
  • కడుపులో రాడ్లు దిగిన వ్యక్తికి పునర్జన్మ [ 18-02-2026] ప్రమాదవశాత్తు మేడపై నుంచి కిందపడిన వ్యక్తి కడుపులో రెండు ఇనుపచువ్వలు గుచ్చుకున్నాయి. అరుదైన శస్త్రచికిత్స చేసి ఆ వ్యక్తికి పునర్జన్మను ప్రసాదించారు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు.
  • ఏఐ.. ఆటొమేషన్‌తో వైద్య రంగంలో పెనుమార్పులు [ 18-02-2026] ‘ప్రపంచ ఆరోగ్య ముఖచిత్రం వేగంగా మారిపోతోంది. నిన్నటి వరకూ అసాధ్యమనుకున్న చికిత్సలు నేడు ‘టెక్‌-బయో’ విప్లవంతో సుసాధ్యమవుతున్నాయి.
  • చింతల్‌ సర్కిల్‌ కార్యాలయంలో ఏసీబీ సోదాలు [ 18-02-2026] జీహెచ్‌ఎంసీ చింతల్‌ సర్కిల్‌ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌ వాహీద్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.
  • 36.8 కి.మీ దూరం.. 25 నిమిషాలు [ 18-02-2026] హైదరాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి  ఊపిరితిత్తుల మార్పిడి కోసం మంగళవారం శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి బేగంపేట వరకు మంగళవారం సాయంత్రం ఆర్జీఐఏ ట్రాఫిక్‌ పోలీసులు గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేశారు.
  • పైప్‌లైన్‌ ధ్వంసం.. సెల్లార్లలోకి నీరు [ 18-02-2026] మణికొండలో భారీ పైప్‌లైన్‌ ధ్వంసం కావడంతో పలు కాలనీల్లోని అపార్టుమెంట్ల సెల్లార్లలోకి పెద్దఎత్తున వరదనీరు చేరింది.
  • మరో ప్రీలాంచ్‌ మోసం [ 18-02-2026] రాజధానిలో భారతి బిల్డర్స్‌ సంస్థ మరో ప్రీలాంచ్‌ మోసం బయటపడింది. ‘రెండేళ్లలో మీ పెట్టుబడి రెట్టింపు చేసుకోండి..’అంటూ భారతి బిల్డర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.5.39 కోట్ల డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసింది.
  • భవనాలకూ ఆధార్‌ [ 18-02-2026] ప్రతి మనిషికీ విశిష్ట గుర్తింపు సంఖ్యతో ఆధార్‌కార్డు జారీ అయినట్లు.. నగరంలోని ప్రతి భవనానికి కూడా క్యూఆర్‌ కోడ్, విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ కాబోతుంది.
  • హోర్డింగ్‌లపై నిషేధం ఎత్తివేత! [ 18-02-2026] నగరంలో మళ్లీ హోర్డింగ్‌లు ఏర్పాటు కాబోతున్నాయి. ప్రజల భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్నాయనే కారణంతో గత సర్కారు..
  • త్వరలో జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో.. ఏఐ చాట్‌బాట్‌ [ 18-02-2026] నిర్మాణ అనుమతికి దరఖాస్తు చేసుకోవడం ఎలా, జనన, మరణ ధ్రువపత్రాలు పొందాలంటే ఏయే పత్రాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి తదితర సందేహాలను నివృత్తి చేసుకునేందుకు అధికారుల వద్దకు వెళ్లనక్కర్లేదు.
  • నిబంధనలకు విరుద్ధంగా అధిక బిల్లు [ 18-02-2026] కొవిడ్‌-19 చికిత్స పేరుతో అధిక బిల్లు వసూలు చేసిన  ఓల్డ్‌ బోయిన్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిని హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌-2 మందలించింది.
  • భార్య చికెన్‌ వండలేదని విశ్రాంత ఉద్యోగి ఆత్మహత్య [ 18-02-2026] అతడో డిఫెన్స్‌ విశ్రాంత ఉద్యోగి.. చికెన్‌ తీసుకుని ఇంటికెళ్లాడు.. ఘుమఘుమలాడే చికెన్‌ కూర వండాలని భార్యకు చెప్పాడు.. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.
  • సిటీ ఏసీ బస్సుల్లో 30% ఛార్జీల తగ్గింపు! [ 18-02-2026] నగరంలో ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. మార్చి నుంచి ఎండలు తీవ్రం కానున్న నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సు ఛార్జీల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.