KTR: 2028లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను బొంద పెట్టడం ఖాయం: కేటీఆర్‌

Eenadu icon
By Telangana News Team Published : 24 Dec 2025 20:22 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: 2028లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని బొంద పెట్టడం ఖాయమని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. కోస్గి సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్‌ మండిపడ్డారు. నీటి ద్రోహంపై జవాబు చెప్పలేక నికృష్టపు మాటలు మాట్లాడుతున్నారని ‘ఎక్స్‌’ వేదికగా ధ్వజమెత్తారు. ‘‘జల హక్కులను కాపాడటం రేవంత్‌రెడ్డికి చేతకాదు. పాలమూరు ప్రాజెక్టు గొంతుకోసి.. సొంత జిల్లానే దగా చేస్తున్నారు. తెలంగాణ సోయిలేని.. రాష్ట్ర ప్రయోజనాలు రక్షించలేని వ్యక్తి రేవంత్‌రెడ్డి. శాసన సభలో.. జనసభలో ప్రతిచోటా కాంగ్రెస్ జలద్రోహాన్ని ఎండగడతాం. జనం అన్నీ గమనిస్తున్నారు.. సందర్భం వచ్చినప్పుడు తొక్కి నారతీస్తారు’’ అని కేటీఆర్‌ అన్నారు.

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఈ నెల 23న తెలంగాణ క్యాబినెట్‌ భేటీ.. వాటిపైనే చర్చ! రాష్ట్ర మంత్రివర్గం ఈనెల 23న భేటీ కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరగనుంది.
  • శివుడికి ప్రసాదంగా డ్రగ్స్‌.. సీపీ సజ్జనార్‌ పోస్టుతో పోలీసుల యాక్షన్‌ మహా శివరాత్రి రోజున దేవుడికి మాదకద్రవ్యాలు చూపిస్తూ కొందరు రీల్స్‌ చేయడంపై హైదరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.