Civil Aviation: భారత్లో రెండు విమానయాన సంస్థలకు అనుమతి

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్డెస్క్: దేశంలో మరో రెండు విమానయాన సంస్థలకు పౌరవిమానయాన శాఖ అనుమతి ఇచ్చింది. అల్ హింద్ ఎయిర్, ఫ్లై ఎక్స్ప్రెస్ సంస్థలకు అనుమతి ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ రెండింటికీ మంత్రిత్వ శాఖ నుంచి నిరభ్యంతరపత్రాలు(NOC) లభించాయి. ఉత్తర్ప్రదేశ్కు చెందిన మరో సంస్థ శంఖ్ ఎయిర్కు ఇప్పటికే ఎన్ఓసీ వచ్చింది. దాంతో అది 2026 నుంచి కార్యకలాపాలను ప్రారంభించనుంది.
కొన్ని వారాల క్రితం దేశీయ విమానయాన సంస్థ ఇండిగో కార్యకలాపాల్లో తీవ్ర సంక్షోభం తలెత్తింది. దాంతో కొన్నిరోజుల పాటు వందల సంఖ్యలో సర్వీసులు రద్దయ్యాయి. ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లో చిక్కుకుపోయారు. ఆ పరిస్థితులపై పార్లమెంట్లో మాట్లాడిన విమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్నాయుడు ( Rammohan Naidu).. ఈ రంగంలో గుత్తాధిపత్యానికి తాము తావివ్వడంలేదని, మరిన్ని విమానయాన సంస్థలను ఇందులోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. కొత్త సంస్థలు అడుగుపెట్టడానికి ఇదే సరైన తరుణమని చెప్పారు. తాజాగా రెండు సంస్థలకు అనుమతి లభించినట్లు మంత్రి వెల్లడించారు.
వేగంగా వృద్ధి చెందుతోన్న దేశీయ విమానయాన రంగం (Civil Aviation Market)లో ఇండిగో, ఎయిరిండియాకు 90 శాతానికిపైగా వాటా ఉంది. ఒక్క ఇండిగో వాటానే 65 శాతం మేర ఉంది.
► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- వచ్చే 12-18 నెలలు మార్కెట్కు మంచి రోజులు గత ఏడాదిన్నరగా ఒడుదొడుకులకు లోనవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు, ఇకపై కోలుకునే అవకాశముందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఎండీ, సీఈఓ ధీరజ్ రెల్లి విశ్లేషించారు.
- అంతరిక్షంలో డేటా సెంటర్లు భూమిపై చిన్న చెత్త ముక్క పడి ఉందనుకోండి. పెద్ద ప్రమాదమేమీ లేదు. కానీ, అంతరిక్షంలో పరిస్థితి వేరు. అక్కడ చిన్న శకలం వేగంగా దూసుకొచ్చి ఢీకొడితే పెను ప్రమాదమే సంభవిస్తుంది.
- వేతన పెంపులు.. తగ్గేదేలే కొత్త లేబర్ కోడ్లను అమలు చేయడం వల్ల అధిక వేతన బిల్లులు చెల్లించాల్సి వస్తున్నప్పటికీ.. చాలా వరకు కంపెనీలు వేతన పెంపులను తగ్గించే ప్రయత్నం చేయకపోవచ్చని హెచ్ఆర్ అధిపతులు, వేతన నిపుణులు అంటున్నారు.
- జియో, ఆంథ్రోపిక్ వంటి 15 కంపెనీలతో కూటమి ఏర్పాటు జియో ప్లాట్ఫామ్స్, ఆంథ్రోపిక్, ఎరిక్సన్తో పాటు సెమీ కండక్టర్లకు క్లౌడ్ మౌలిక సదుపాయాలు, అనుసంధానత అందించే రంగంలో సారూప్యత కలిగిన అంతర్జాతీయ సంస్థలు విశ్వసనీయ సాంకేతిక కూటమి (టీటీఏ)ని ఏర్పాటు చేయడానికి చేతులు కలిపాయి.
- విస్తరణ బాటలో అన్విత గ్రూపు స్థిరాస్తి రంగంలోని అన్విత గ్రూపు దేశంలోని, వివిధ ప్రాంతాలతోపాటు, అమెరికా, దుబాయ్లకూ తమ ప్రాజెక్టులను విస్తరించే ప్రణాళికల్లో ఉంది.
- ఐఓబీ నుంచి మరిన్ని స్టార్టప్ బ్యాంకింగ్ శాఖలు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) తన 90వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘స్టార్టప్ బ్యాంకింగ్’ నెట్వర్క్ను విస్తరించింది.
- ట్రెన్స్లో 60% వాటా కొనుగోలు: ఇక్సిగో స్పెయిన్లోని రెండో అతి పెద్ద రైలు బుకింగ్ ప్లాట్ఫామ్ ట్రెన్స్లో 60 శాతం వాటాను 11.70 మిలియన్ యూరోలకు (రూ.125 కోట్లకు పైగా) కొనుగోలు చేయడానికి బోర్డు బైండింగ్ ఒప్పందాల అమలుకు ఆమోదం తెలిపినట్లు ట్రావెల్ అగ్రిగేటర్ ఇక్సిగో వెల్లడించింది.
- మణప్పురంలో వాటా కొనుగోలుకు బెయిన్ క్యాపిటల్కు ఆర్బీఐ అనుమతులు పసిడి రుణాల సంస్థ మణప్పురం ఫైనాన్స్లో 41.66 శాతం వాటాను బెయిన్ క్యాపిటల్ కొనుగోలు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతులు ఇచ్చింది.
- ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్కు ఎన్విడియా సీఈఓ జెన్సెన్ రావట్లేదు ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో పాల్గొనాల్సిన ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్, తన భారత పర్యటనను రద్దు చేసుకున్నారని ఒక ఉన్నతాధికారి వెల్లడించారు.