నాణ్యమైన విద్యుత్ అందించడమే ‘కరెంటోళ్ల జనం బాట’ కార్యక్రమం లక్ష్యం: సీఎండీ

Eenadu icon
By Andhra Pradesh Dist. Team Published : 23 Dec 2025 17:23 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

పీలేరు: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ‘కరెంటోళ్ల జనం బాట’ కార్యక్రమం చేపట్టినట్లు ఏపీ ఎస్పీడీసీఎల్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) లోతేటి శివశంకర్ మంగళవారం తెలిపారు. అన్నమయ్య జిల్లాలోని  పీలేరు మండలం గూడరేవు పల్లి గ్రామం పుట్టావాండ్లపల్లిలో ఏపీ ఎస్పీడీసీఎల్ పీలేరు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ) చంద్రశేఖర్ రెడ్డి, విద్యుత్ సిబ్బందితో ఇంటింటా పర్యటించారు. విద్యుత్ సమస్యలు ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో విద్యుత్ కనెక్షన్, విద్యుత్ భద్రత, ప్రమాదాల నివారణ చర్యలపై క్షుణ్నంగా క్షేత్రస్థాయిలో పరిశీలించామన్నారు. అందులో ఐదు సమస్యలకు యుద్ధ ప్రాతిపదికనగా పరిష్కార మార్గం చూపించారు. మిగతా సమస్యలకు నిర్దేశిత గడువులోగా పరిష్కార మార్గం చూపించాలని అధికారులను ఆదేశించారు. పొలాల వద్ద స్టాటర్లు, ఎర్తింగ్ భద్రత చర్యలపై జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. నిరంతరం విద్యుత్ సిబ్బంది అందుబాటులో ఉండి నాణ్యమైన విద్యుత్ అందించడమే ‘కరెంటోళ్ల జనం బాట’ కార్యక్రమం ఉద్దేశమని పేర్కొన్నారు.

► Read latest Ysr kadapa Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • విద్యుదాఘాతంలో రెండు ఎద్దులు మృతి [ 18-02-2026] విద్యుత్తు షాక్‌తో రెండు ఎద్దులు మృతి చెందిన ఘటన కడప జిల్లా కాశినాయన మండలం బాలాయపల్లిలో చోటుచేసుకుంది.
  • కోదండ రాముడి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తాం [ 18-02-2026] వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో ఈసారి శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని తితిదే జేఈవో వల్లూరు వీరబ్రహ్మం తెలిపారు.
  • కులవర్ధన్‌ను రక్షక్‌ వాహనంలో తరలిస్తుండగా తప్పించుకున్నాడు: ఎస్పీ [ 18-02-2026] అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చిన్నారిపై హత్యాచారం కేసు నిందితుడు కులవర్ధన్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోందని ఎస్పీ ధీరజ్‌ చెప్పారు.
  • బాలికపై హత్యాచారం.. చెరువులో నిందితుడు కులవర్ధన్‌ మృతదేహం [ 18-02-2026] అన్నమయ్య జిల్లా కనసానివారిపల్లె చెరువులో యువకుడి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది.
  • రూ. 30 కోట్లు చెత్తలో పోసినట్టేనా! [ 18-02-2026] కడప నగరపాలక, న్యూస్‌టుడే: రూ. 30 కోట్లు ఖర్చు పెట్టి అట్టహాసంగా పనులు చేపట్టారు. చెత్త కనుమరుగవుతుందని జనం సంతోషించారు. ఏళ్లు గడుస్తున్నా ప్రారంభానికి నోచలేదు.
  • ఎదురింట్లోనే మృగాడు! [ 18-02-2026] మానవీయ విలువలకే సమాధి కట్టే.. మనుషులమన్న విషయానికే అనుమానమొచ్చే దుర్ఘటన మంగళవారం మదనపల్లె జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మృగాడి వాంఛాగ్నిలో ఓ లేత కలువ కాలిపోయింది.
  • కూడళ్లు.. నరకానికి నకళ్లు [ 18-02-2026] పుంగనూరు పట్టణ సమీపంలో వెళ్లే ముంబై-చెన్నై జాతీయ రహదారిలో పలు కూడళ్లు  ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. మదనపల్లె-పలమనేరు మధ్య గల ఈ జాతీయ రహదారి నిత్యం రద్దీగా ఉంటోంది.
  • చురుగ్గా వసతి గృహ నిర్మాణాలు [ 18-02-2026] సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు సొంత భవనాల సమస్య వెంటాడుతోంది. కొన్ని చోట్ల ఎప్పుడో నిర్మించిన పాత భవనాలు శిథిలావస్థకు చేరాయి.
  • కాబోయే అమ్మకు ఆపద [ 18-02-2026] పండంటి శిశువుకు జన్మనివ్వాల్సిన అమ్మను రక్తహీనత వేధిస్తోంది. పౌష్టికాహార లోపమే చాలా మంది గర్భిణులకు శాపమై చుట్టుముడుతోంది.
  • సౌత్‌జోన్‌ క్రికెట్‌ పోటీల్లో.. [ 18-02-2026] ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌-12 అంతర్‌ జిల్లాల వన్డే క్రికెట్‌ పోటీల్లో చిత్తూరు, కర్నూలు జట్లు గెలుపొందాయి. కర్నూలు జట్టు సభ్యుడు గోవర్థన్‌రెడ్డి సెంచరీ చేశాడు.
  • ఉరేసుకుని యువకుడి బలవన్మరణం [ 18-02-2026] మండలంలోని ఇందిరానగర్‌లో నిఖిల్‌ (28) అనే యువకుడు మంగళవారం ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గతేడాది అతని తల్లి అనారోగ్యంతో మృతి చెందగా తండ్రి రామకృష్ణతో కలిసి ఉంటున్నాడు.
  • మాఫియా దందా.. ఆగేదుందా! [ 18-02-2026] జిల్లాలో పొగాకు మాఫియాకు కళ్లెం వేసే వారే కరవయ్యారు.. రూ.కోట్లు దోపిడీ సాగిస్తున్నా కళ్లకు గంతలు కట్టుకున్నారు.. మాఫియా ఇచ్చే మామూళ్లకు అలవాటు పడిన అధికారులు యథేచ్ఛగా ధరల బాదుడు కొనసాగుతున్నా అటువైపు కన్నెత్తి చూడడం లేదు.
  • ఏసీబీ ఆన్‌ డ్యూటీ [ 18-02-2026] అవినీతి నిరోధక శాఖ అవినీతి అధికారుల భరతం పడుతోంది. లంచం తీసుకుంటున్నారని కచ్చితమైన సమాచారం వస్తే చాలు దాడులు చేస్తోంది. 2025లో ఒక్క దాడీ లేదు.
  • బంగారు గొలుసు లాక్కెళ్లిన దుండగులు [ 18-02-2026] ద్విచక్రవాహనంపై వెళ్తున్న మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును దుండగుడు లాక్కెళ్లిన ఘటన బి.కోడూరు మండల పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది.