పార్టీ అధిష్ఠానం నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: నక్కల రాఘవ

- A
- A+
- A++

చినగంజాం: బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికి కృషి చేయాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియమితులైన నక్కల రాఘవ.. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును మర్యాదపూర్వకంగా హైదరాబాద్లో మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరికి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. రాఘవను.. ఎమ్మెల్యే ఏలూరి శాలువాతో ఘనంగా సత్కరించి, హృదయపూర్వక అభినందనలు తెలిపారు. పార్టీకి అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ అభ్యున్నతికి కృషి చేయాలని రాఘవకి సూచించారు. ప్రజాసేవే లక్ష్యంగా, పార్టీ విధానాలను క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పడాలని ఆయన ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో పార్టీ అనుబంధ విభాగాల కమిటీలను పటిష్టం చేయాలని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యతతో పనిచేస్తే రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతమవుతుందని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని.. నాయకులు, కార్యకర్తల సహకారంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని రాఘవ తెలిపారు.
► Read latest Bapatla Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం [ 18-02-2026] చినగంజాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమాన్ని బుధవారం ఏర్పాటు చేశారు.
- సముద్ర మొక్కల పెంపకం లాభదాయకం [ 18-02-2026] సముద్ర మొక్కల పెంపకం లాభదాయకమని సీఎస్ఐఆర్, సీఎస్ఎంసీఆర్ఐ శాస్త్రవేత్త సతీష్ పేర్కొన్నారు.
- నీరు చల్లేదెలా.. నిప్పు ఆర్పేదెలా.. [ 18-02-2026] పర్చూరులో ఓ టింబర్ డిపోలో గతేడాది భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చీరాల, చిలకలూరిపేటల నుంచి అగ్నిమాపక వాహనాలు 20 కి.మీ. దూరం వచ్చి మంటలు ఆర్పటానికి ప్రయత్నించాయి.
- వచ్చిన మిర్చి వచ్చినట్టే.. [ 18-02-2026] ఎండుమిర్చికి మంచి ధరలు లభిస్తున్న నేపథ్యంలో సరకు విక్రయించడానికే రైతులు మొగ్గు చూపుతున్నారు. గతేడాది శీతల గోదాముల్లో నిల్వ చేసినవారు కూడా సరకు మార్కెట్కు తరలిస్తున్నారు.
- వి‘జేఈఈ’భవ [ 18-02-2026] జేఈఈ మెయిన్స్లో బాపట్ల, చినగంజాం ప్రాంత విద్యార్థులు మెరిశారు. అడ్వాన్స్డ్లోనూ సత్తాచాటి పేరున్న ఐఐటీల్లో చదువుతామని, భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగడమే లక్ష్యంగా అడుగులు వేస్తామని చెబుతున్నారు.
- రాజధానిలో భూసేకరణకు సిద్ధం [ 18-02-2026] నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి భూసమీకరణలో భూములివ్వని రైతుల నుంచి భూసేకరణ ద్వారా తీసుకునేందుకు ప్రణాళిక సిద్ధమైంది. కొంతమంది రైతులు వివిధ కారణాలతో ఇప్పటికీ భూసమీకరణలో భూములివ్వలేదు.
- మూగ జీవాలకూ ఆరోగ్య కార్డులు [ 18-02-2026] పశువుల ఆరోగ్య పరిరక్షణకు డిజిటల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పశుసంవర్ధక శాఖ ప్రక్షాళన, పశు సంపద వృద్ధి, వాటి ఆరోగ్య పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ‘భారత్ పశుధన్’ యాప్ను ప్రారంభించింది.
- చిట్టి తల్లులు.. చేదు నిజాలు.. [ 18-02-2026] చిట్టితల్లులు చిక్కుల్లో పడుతున్నారు.. కౌమార దశలోనే పెద్ద బాధ్యతను కడుపులో మోస్తున్నారు. తల్లిదండ్రుల అవగాహనా రాహిత్యం, అధికారుల నిర్లిప్తత.. కారణాలేమైనా టీనేజ్ ప్రెగ్నెన్సీతో ఇబ్బందులు పడుతున్నారు.
- ఇంటి నుంచి వెళ్లిపోయిన పిల్లలు కాచిగూడలో గుర్తింపు [ 18-02-2026] తల్లిదండ్రులు మందలించారని ఇంటి నుంచి వెళ్లిన పిల్లలను తెలంగాణ రాష్ట్రం కాచిగూడ రైల్వేస్టేషన్లో పోలీసులు గుర్తించారు.
- కుమార్తెను దూషించొద్దన్నందుకు తల్లిపై కత్తితో దాడి [ 18-02-2026] మండలంలోని నడింపల్లిలో మహిళపై వ్యక్తి కత్తితో దాడి చేశాడు. వివరాలు ఇలా.. మంగళవారం గ్రామానికి చెందిన సామ్రాజ్యం తన కుమార్తె(16) పొలం వద్ద గడ్డి కోసేందుకు వెళ్లింది.