జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవన నిర్మాణాలకు రూ.8.50 కోట్లు మంజూరు: ఎమ్మెల్యే

Eenadu icon
By Andhra Pradesh Dist. Team Published : 22 Dec 2025 19:48 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

శృంగవరపుకోట: శృంగవరపుకోట జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవన నిర్మాణాలకు రూ.8.50 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు. శృంగవరపుకోటలోని కోర్టు భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో.. ప్రస్తుతం అద్దె భవనంలో కోర్టు కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. కోర్టు భవనాలకు నిధులు మంజూరు చేయించాలంటూ న్యాయవాదుల సంఘం ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. దీంతో కోర్టు భవన నిర్మాణాలకు రూ.8.50 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసిందని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, న్యాయశాఖ మంత్రి ఫరూక్‌కు ధన్యవాదాలు తెలిపారు. కొత్తవలస కోర్టు భవనాలకు కూడా నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరామని ఎమ్మెల్యే వివరించారు.

► Read latest Vizianagaram Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • వీరు వెళ్లరు.. వారు చెప్పరు! [ 18-02-2026] ఏకీకృత కుటుంబ సర్వేకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. కొన్ని సచివాలయాల పరిధిలో సిబ్బంది సహకరించకపోవడం, ఇంకొన్ని చోట్ల జనం సమాచారం ఇచ్చేందుకు ఆసక్తి చూపకపోవడంతో నత్తనడకన సాగుతోంది.
  • మంచంపై తండ్రి.. ఆసుపత్రిలో కుమారుడు [ 18-02-2026] కిరాణా దుకాణం నడిపి కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తండ్రి తీవ్ర అనారోగ్యం పాలై మంచానికి పరిమితమయ్యాడు. నేనున్నా నాన్న.. మీకేం కాదు.. కుటుంబానికి అండగా ఉంటా అని ధైర్యం చెప్పే కుమారుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ఉన్నాడు.
  • రెండు పూటలా వెయ్‌.. వారం రోజులు వాడేయ్‌..! [ 18-02-2026] ‘విజయనగరం అంబటిసత్రం సమీపంలోని ఓ మందుల దుకాణం యజమాని మత్తెక్కించే దగ్గు మందు, కాలం చెల్లిన ఔషధాలు విక్రయించాడు. దేహ్రాదూన్‌ నుంచి ప్రతి నెలా దిగుమతి చేసుకునేవాడు.
  • పకోడి కోసం వెళ్తే.. [ 18-02-2026] రేగిడి మండలం బూరాడ గ్రామానికి చెందిన పల్ల వెంకటరమణరావు కుటుంబ అవసరాల కోసం రాజాం పట్టణంలోని ఒక బ్యాంకులో సోమవారం బంగారు నగలు కుదవ పెట్టి రూ.2.15 లక్షలు రుణం తీసుకున్నారు.
  • అమెరికా అమ్మ ఇక లేరు [ 18-02-2026] దత్తిలో హోమ్స్‌ ఆఫ్‌ ది ఇండియన్‌ నేషన్‌(హొయినా) అనాథ ఆశ్రమ వ్యవస్థాపకురాలు, అమెరికాకు చెందిన చార్లెస్‌ డి లార్జ్‌(91) ఇకలేరు. అమెరికాలోని తన నివాసంలో సోమవారం మృతిచెందారని క్యాంపస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డా.గ్లోరీ జేన్స్, మేనేజర్‌ శ్రీనివాస్‌కుమార్‌ మంగళవారం తెలిపారు.
  • మెరిశారు.. మురిశారు [ 18-02-2026] జేఈఈ అడ్వాన్స్డ్‌ పరీక్ష ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మంచి పర్సంటైల్‌తో ప్రతిభ చూపారు.