Crime News: పల్నాడు జిల్లాలో ఘోరం.. అన్నదమ్ముల దారుణహత్య

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

దుర్గి: పల్నాడు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అన్నదమ్ములను గుర్తుతెలియని వ్యక్తులు నరికి చంపారు. దుర్గి మండలం అడిగొప్పలలో ఈ ఘటన జరిగింది. తమ్ముడు కొత్తా హనుమంతు, అన్న కొత్తా శ్రీరాంమూర్తిని ఆదివారం అర్ధరాత్రి వేటకొడవళ్లతో హతమార్చారు. హనుమంతును గ్రామం మధ్యలో.. శ్రీరాంమూర్తిని అమ్మవారి గుడి సమీపంలో అత్యంత కిరాతకంగా చంపేశారు. మృతులిద్దరినీ తెదేపా సానుభూతిపరులుగా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.
నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టొద్దు: మంత్రి గొట్టిపాటి
ఈ జంట హత్యలపై పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. జిల్లా ఎస్పీతో ఆయన మాట్లాడారు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టవద్దని ఆదేశించారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Dec 2025 08:02 IST