Shambhala: పంచభూతాల్ని శాసిస్తుంది

Eenadu icon
By Cinema Desk Updated : 22 Dec 2025 06:51 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

‘శంబాల’ చిత్రంతో క్రిస్మస్‌ బరిలో అలరించనున్నారు ఆది సాయికుమార్‌. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని యుగంధర్‌ ముని తెరకెక్కించారు. అన్నభిమోజు, మహీధర్‌ రెడ్డి నిర్మించారు. అర్చన అయ్యర్‌ కథానాయిక. స్వసిక, రవివర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 25న రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర మిస్టిక్‌ ట్రైలర్‌ను హీరో నాని ఆదివారం విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్‌ చాలా అద్భుతంగా ఉంది. సినిమాపై నమ్మకాన్ని పెంచుతోంది. ప్రస్తుతం ప్రేక్షకులు ఇలాంటి జానర్‌ చిత్రాల్నే కోరుకుంటున్నారు. ఈ సినిమాతో ఆదికి విజయం దక్కాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ఇక ట్రైలర్‌ విషయానికొస్తే.. ఆకాశం నుంచి ఓ ఉల్క రాలిపడటం.. ‘‘పంచభూతాల్ని శాసిస్తుందంటే ఇది సాధారణమైనది కాదు’’ అంటూ ఆ ఉల్క శక్తిని చూపించడం ఆసక్తిరేకెత్తించింది. మరి ఉల్క పడిన తర్వాత నుంచి ఆ ఊరి ప్రజలకు ఎదురైన వింత సమస్యలేంటి? దాన్ని అడ్డుకునేందుకు నాస్తికుడైన హీరో ఎందుకు రంగంలోకి దిగాల్సి వచ్చింది? ఆ సమస్యకు పరిష్కారం కనుగొనే క్రమంలో తను ఎదుర్కొన్న సవాళ్లేంటి? అన్నది మిగిలిన కథ. ‘‘విధి నిన్నిక్కడికి రప్పించింది. నువ్వే ఈ సమస్యకి కొత్త పరిష్కారం కనిపెడతావేమో’’ అంటూ ట్రైలర్‌లో హీరోని ఉద్దేశిస్తూ వినిపించిన డైలాగ్‌ ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాకి సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, ఛాయాగ్రహణం: ప్రవీణ్‌ కె. బంగారి. 


► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Dec 2025 02:19 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • అదే బాధగా అనిపిస్తుంది ‘‘మంచి వినోదంతో పాటు బలమైన భావోద్వేగాలతో నిండిన సినిమా ‘హే బల్‌వంత్‌’’ అన్నారు హీరో సుహాస్‌. ఇది తన కెరీర్‌లోనే చాలా వేగంగా పూర్తి చేసిన చిత్రమని.. దీనితో తాను ఎదురు చూస్తున్న విజయం అందుకుంటాననే నమ్మకముందని ధీమా వ్యక్తం చేశారు.
  • ప్రియమణి.. ఇండో-హాలీవుడ్‌ చిత్రం తెరపై వైవిధ్యమైన పాత్రలతో భావోద్వేగాలను పంచడంతోపాటు.. యాక్షన్‌ సన్నివేశాలతోనూ అదరగొడుతుంది నటి ప్రియమణి. ఇప్పుడామె ఖాతాలో ఓ హాలీవుడ్‌ నిర్మాణసంస్థ రూపొందించనున్న కొత్త ప్రాజెక్ట్‌ చేరింది.
  • బాలీవుడ్‌ వైపు తొలి అడుగు? గతేడాది ‘మదరాసి’, ‘కాంతార 2’ లాంటి చిత్రాలతో మంచి విజయాన్ని అందుకుంది కథానాయిక రుక్మిణీ వసంత్‌. చిత్రపరిశ్రమకు వచ్చిన తక్కువ రోజుల్లోనే భాషతో సంబంధం లేకుండా అవకాశాల్ని అందుకుంటోన్న ఈ భామ..
  • జోడీ కుదిరేనా! గతేడాది ‘జాక్‌’, ‘తెలుసు కదా’ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించారు కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ. ఇప్పుడు మరో కొత్త సినిమాని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
  • మరకతమణి 2కి శ్రీకారం ఆది పినిశెట్టి నుంచి వచ్చిన ఫాంటసీ కామెడీ థ్రిల్లర్‌ ‘మరకతమణి’ 2017లో విడుదలై.. ప్రేక్షకుల్ని అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాకి కొనసాగింపుగా ‘మరకతమణి 2’ని పట్టాలెక్కించారు ఆది.
  • ఆ పాటలు వాడొద్దు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు న్యాయస్థానంలో చుక్కెదురైంది. సరిగమ సంగీత సంస్థకు, ఆయనకు కోర్టులో వివాదం నడుస్తోంది. ఈ కేసుకు సంబంధించి దిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
  • వెబ్‌సిరీస్‌ కోసం! ‘క’, ‘కె-ర్యాంప్‌’ విజయాలతో జోరు మీదున్నారు యువ హీరో కిరణ్‌ అబ్బవరం. ఇప్పుడాయన ఓటీటీలోకి తొలి అడుగు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ‘డియర్‌ కామ్రేడ్‌’ ఫేమ్‌ భరత్‌ కమ్మ దర్శకత్వంలో ముస్తాబు
  • గ్రామీణ కథ ‘సెయాన్‌’ ‘సెయాన్‌’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు శివ కార్తికేయన్‌. ‘అమరన్‌’ విజయం తర్వాత ఆయన.. కమల్‌హాసన్‌ సొంత నిర్మాణ సంస్థలో చేస్తున్న రెండో చిత్రమిది. శివకుమార్‌ మురుగేశన్‌ తెరకెక్కిస్తున్నారు.
  • అలియాకు బాఫ్టా గౌరవం ప్రముఖ బాలీవుడ్‌ కథానాయిక అలియా భట్‌కు మరోసారి అంతర్జాతీయ గౌరవం దక్కింది. బాఫ్టా(బ్రిటిష్‌ అకాడమీ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌) 79వ ఎడిషన్‌ పురస్కారాలను అందించే ప్రెజెంటర్ల జాబితాను ప్రకటించింది.
  • సంక్షిప్త వార్తలు (5) ప్రముఖ హిందీ సినీ రచయిత, నటుడు, సల్మాన్‌ఖాన్‌ తండ్రి సలీం ఖాన్‌(90) అనారోగ్య పరిస్థితుల కారణంగా మంగళవారం ముంబయిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. జావేద్‌ అక్తర్‌తో కలిసి ఆయన రచన చేసిన ‘షోలే’, ‘దీవార్‌’, ‘డాన్‌’ చిత్రాలు భారతీయ చిత్రసీమలో నిలిచిపోయాయి.