Balakrishna: ‘అఖండ 2’.. సనాతన ధర్మ పరిరక్షణ ఆవశ్యకతను చాటింది: బాలకృష్ణ

Eenadu icon
By Entertainment Team Published : 20 Dec 2025 00:05 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రమోషన్స్‌లో భాగంగా ‘అఖండ 2’ (Akhanda 2) చిత్ర బృందం వారణాసిని సందర్శించింది. నటుడు బాలకృష్ణ ( Balakrishna), దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) తదితరులు కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకున్నారు. అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ‘అఖండ 2’ సినిమా సనాతన హైందవ ధర్మ పరిరక్షణ ఆవశ్యకతను చాటిందన్నారు. ఇది కేవలం తెలుగు సినిమా కాదని, భారతీయులందరి చిత్రమని పేర్కొన్నారు. మంచి సినిమా కోసం చేసిన ప్రయత్నం ఫలించిందన్నారు. చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇటీవల యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ని కలిశామని, భక్తి, ధర్మం ప్రధానంగా సినిమాని రూపొందించినందుకు అభినందనలు తెలిపారని గుర్తుచేసుకున్నారు. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ మూవీ ఈనెల 12న విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్‌లో సక్సెస్‌ ఈవెంట్‌ నిర్వహించిన టీమ్‌ ఇప్పుడు ఉత్తరాదిలో సినిమాని ప్రమోట్‌ చేస్తోంది.


► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • మరో చీకటి కోణం.. ‘ది కేరళ స్టోరీ2’ ట్రైలర్‌ చూశారా? న్నో వివాదాలు, విమర్శల మధ్య విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను సొంతం చేసుకుంది ‘ది కేరళ స్టోరీ’. ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్‌గా ‘ది కేరళ స్టోరీ 2’ రాబోతోంది.
  • అకౌంట్‌లో రూ.లక్ష చూస్తే చాలనుకున్నా..: విశ్వక్‌ సేన్‌ ఒకప్పుడు తన అకౌంట్‌లో రూ.50వేలు చూడటం కల అని విశ్వక్‌ సేన్‌ అన్నారు. ‘హిట్‌’ సినిమాకు అడ్వాన్స్‌ బ్యాంక్‌లో పడే వరకూ తన అకౌంట్‌లో అంత డబ్బు ఎప్పుడూ చూడలేదని గుర్తుచేసుకున్నారు.
  • అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 రూల్స్.. క్షమాపణలు చెప్పిన కావేరి స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ను (Allu Arjun) కలవాలంటే 42 నిబంధనలు తప్పకుండా పాటించాలంటూ బ్రాండ్‌ స్ట్రాటజర్‌ కావేరి బరూవా చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.
  • 4 ఏళ్లలో 12 సినిమాలు.. కెరీర్‌ పీక్‌లో ‘సూసైడ్‌’: నటి ప్రత్యూష కథ ఇది..! Actress Prathyusha: గ్లామర్‌ వెలుగుల సినీ ప్రపంచంలో తెర వెనుక చీకటి రహస్యాలెన్నో..!  స్క్రీన్ మీద నవ్వులు చిందిస్తూ అభిమానులను అలరించే నటీనటుల జీవితాల్లో.. ఎవరికీ తెలియని విషాదగాథలు దాగి ఉంటాయి.
  • మేకప్‌ వేసుకుని ఐదు గంటలకే బీచ్‌కు వెళ్తే.. తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన చిత్రాలను అందించి ప్రేక్షకులను అలరించిన దిగ్గజ నటులు ఎన్టీఆర్‌ (NTR), ఏయన్నార్‌ (ANR). ఇరువురు తమదైన నటనతో అన్ని జానర్‌ల సినిమాల్లోనూ నటించి
  • చిక్కుల్లో ‘ధురంధర్ 2’.. అక్కడ షూటింగ్‌పై బ్యాన్‌! ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ‘ధురంధర్‌ 2’ చిక్కుల్లో పడింది.
  • నటి ప్రత్యూష మృతి కేసు.. సిద్ధార్థరెడ్డి లొంగిపోవాలి: సుప్రీం Actress Prathyusha Case: రెండు దశాబ్దాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు మంగళవారం తుది తీర్పు వెల్లడించింది. సినీ నటి ప్రత్యూష్‌ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలని ఆదేశించింది.
  • విడుదలకు ముందు ‘పేరు’ మార్పు.. మేకర్స్‌ నిట్టూర్పు! సినిమా పేరు మార్పు ఇటీవల ఎక్కువగా కనిపిస్తోంది. ఆ చిత్రాల వివరాలివీ..
  • ఆ పాటలు వాడొద్దు.. ఇళయరాజాకు దిల్లీ హైకోర్టు ఆదేశాలు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా చట్టపరమైన ఇబ్బందుల్లో పడ్డారు.
  • నేనూ వాళ్ల బాటలోనే...! సుహాస్‌ - శివానీ నాగారం జంటగా నటించిన ‘హే భగవాన్‌’ చిత్రం పేరు మార్చుకుంది. సెన్సార్‌ బోర్డు సూచనల మేరకు ఈ టైటిల్‌ని ‘హే బల్‌వంత్‌’గా మార్చినట్లు చిత్ర బృందం ప్రకటించింది.
  • అట్లూరి జీవితం నేటి తరానికో పాఠం కష్టేఫలి అనే సూత్రానికి ప్రముఖ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు నిలువెత్తు నిదర్శనమని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
  • ఏఐ.. నిశ్శబ్దంగా సినిమా భాషని తిరగరాస్తోంది చిత్రపరిశ్రమలో తదుపరి పెద్ద విభజన.. ఏఐ(కృత్రిమ మేధ)ని స్వీకరించేవారికి, వ్యతిరేకించేవారికి మధ్య ఉండదని, ఆ సాధనాలతో మేధో సంపత్తిని నిర్మించేవారికి, వాటిని ఉపయోగించేవారికి మధ్య ఉంటుందని అంటున్నారు హీరో రానా.
  • ఓటీటీలో ఈ వారం కొత్త వారం మొదలైంది.. వినోదాల జాతరకి కూడా సమయం ఆసన్నమైంది. అదేనండీ.. ఓటీటీలో వచ్చే కొత్త కథల గురించే ఇదంతా. ఎప్పటిలాగే ఈ వారం కూడా నాన్‌స్టాప్‌గా ఎంటర్‌టైన్‌ చేయడానికి వైవిధ్యమైన సిరీస్‌లు, సినిమాల్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి ఓటీటీలు. 
  • సూపర్‌ డీలక్స్‌ తర్వాత పాకెట్‌ నావెల్‌ నలుగురు వ్యక్తుల జీవితాల్లోని సంఘటనలతో రూపొంది ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న చిత్రం ‘సూపర్‌ డీలక్స్‌’. విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి, దర్శకుడు త్యాగరాజన్‌ కుమార రాజా కలయికలో వచ్చిన విజయవంతమైన చిత్రమిది.
  • కథ ఇంకా పూర్తి కాలేదు ‘దల్దాల్‌’ సిరీస్‌లో డీసీపీ రీటా ఫెరీరా పాత్రలో కనిపించి నిందితుల్ని పరుగులు పెట్టించింది బాలీవుడ్‌ కథానాయిక భూమి పెడ్నేకర్‌. అమ్రిత్‌ రాజ్‌ గుప్తా దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కు సురేశ్‌ త్రివేణి సృష్టికర్త.
  • ‘జై హనుమాన్‌’ సన్నాహాలు ‘హను-మాన్‌’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. ఇప్పుడాయన ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్‌’ను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు.
  • సంక్షిప్త వార్తలు (4) బాలీవుడ్‌ కథానాయకుడు రాజ్‌కుమార్‌ రావ్‌.. త్వరలో ముంబయికి చెందిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఉజ్వల్‌ నికమ్, క్రికెటర్‌ సౌరభ్‌ గంగూలీ బయోపిక్‌లతో తెరపైకి రావడానికి సన్నద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన..
  • ‘వారణాసి’లో ప్రకాశ్‌రాజ్‌ పాత్ర ఇదే.. వీడియో వైరల్‌ ‘వారణాసి’లోని తన పాత్రపై ప్రకాశ్‌రాజ్‌ స్పందించారు.