Miryalaguda: చదివింది ఎంబీబీఎస్.. చేసేది కంటి శస్త్రచికిత్స

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

మిర్యాలగూడ పట్టణం, న్యూస్టుడే: ఓ ఆసుపత్రిలో వైద్యుడు చదివింది ఎంబీబీఎస్.. కానీ కొన్నేళ్లుగా కంటి శస్త్రచికిత్స నిపుణుడిగా చలామణి అవుతున్నాడు. మరో ఆసుపత్రి రిజిస్ట్రేషన్ ఓ వైద్యుడి పేరుతో ఉంటుంది కానీ.. అక్కడ చికిత్స చేస్తుంది అర్హత లేని వేరే వ్యక్తి. ఇంకో ఆసుపత్రిని అర్హత కలిగిన వైద్యుడే ఏర్పాటు చేశారు. ఆయన ఎక్కడో ప్రాక్టీస్ చేస్తుండగా.. ఇక్కడ మాత్రం ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందే చికిత్స చేస్తున్నారు. ఇవన్నీ నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని పలు కంటి ఆసుపత్రుల్లో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు శనివారం చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో బట్టబయలైన వాస్తవాలు.
తెలంగాణ వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ లాలయ్యకుమార్ ఆదేశాల మేరకు.. సభ్యులు డాక్టర్ నరేశ్కుమార్, డాక్టర్ రవికుమార్, డాక్టర్ శ్రీకాంత్ వర్మ, విజిలెన్స్ అధికారి రాకేశ్లు మిర్యాలగూడలోని ఎనిమిది కంటి ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర కంటి ఆసుపత్రి, షాలిని ఆసుపత్రుల్లో ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ భరత్భూషణ్, డాక్టర్ వెంకటేశ్వర్లు ఎంఎస్ ఆఫ్తల్మాలజీ చేసినట్లుగా బోర్డుపై రాసుకొని కంటి వైద్య నిపుణులుగా చలామణి అవుతున్నట్లు గుర్తించారు. అర్హత లేకున్నా మిర్యాలగూడలో వైద్యం చేస్తున్న పలు ఆసుపత్రుల నిర్వాహకులు, టెక్నీషియన్లు నగేశ్, శ్రీను, నాగరాజు, శివ కోటేశ్వరరావు, వెంకటేశ్, వికాస్కుమార్తో పాటు ఆర్ఎంపీ కోటేశ్వరరావుపై క్రిమినల్ కేసులకు సిఫార్సు చేసినట్లు తెలిపారు. తనిఖీల విషయం తెలుసుకున్న మరో ఆర్ఎంపీ మునీర్ పరారైనట్లు తెలిపారు. తమ పేరిట ఆసుపత్రులు నడుపుతున్నప్పటికీ అందుబాటులో లేని వైద్యులు శ్రీకుమార్, ప్రభు చైతన్య, బషీర్, అమర్, రామశేషయ్యకు కౌన్సిల్ నుంచి నోటీసులు అందించనున్నట్లు పేర్కొన్నారు.
► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 21 Dec 2025 09:29 ISTగమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 4 గ్రాముల బంగారం కోసం వృద్ధుడి దారుణ హత్య! శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పశువులను మేపేందుకు వెళ్లిన వృద్ధుడి చేతికి ఉన్న బంగారు ఉంగరాన్ని తస్కరించేందుకు గుర్తుతెలియని వ్యక్తులు ఆయన్ను దారుణంగా హతమార్చారు.
- కల్వర్టును ఢీకొన్న వాహనం..ముగ్గురి దుర్మరణం నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం తిమ్మన్నపల్లి గ్రామ శివారులో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో కర్ణాటకకు చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.
- కత్తులతో పొడిచి న్యాయవాది దారుణ హత్య ఓ న్యాయవాదిని తన సొంత బావమరుదులే కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చిన ఘటన హైదరాబాద్లో శనివారం చోటు చేసుకుంది.
- దిగుబడి రాక.. అప్పులు తీర్చలేక పంట దిగుబడి రాక.. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఓ రైతు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో చోటు చేసుకుంది.
- విద్యార్థిపై వార్డెన్ల దాష్టీకం.. ఓ విద్యార్థిని తీవ్రంగా గాయపరిచిన ముగ్గురు వార్డెన్లపై ఖమ్మం రెండో పట్టణ పోలీస్స్టేషన్లో శనివారం కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ బాలకృష్ణ కథనం ప్రకారం...
- భార్యతో గొడవ.. కత్తెరతో పసికందు హత్య రక్షించాల్సిన తండ్రే రాక్షసుడిగా మారాడు. భార్యతో జరిగిన చిన్న గొడవకు అభం శుభం తెలియని పసికందును బలి తీసుకున్నాడు. కన్నకూతురు అని కూడా చూడకుండా, అత్యంత కిరాతకంగా కత్తెరతో పొడిచి చిన్నారిని హతమార్చాడు.
- కారులోనే ప్రేయసిని కాల్చేసి.. తనూ కాల్చుకుని.. ప్రేమికుల రోజున ప్రేయసిని హత్యచేసి, ఓ వ్యక్తి తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన నొయిడాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దాద్రీ రోడ్డులో ఓ కారు చాలా సమయం నుంచి నిలిచి ఉందని పోలీసులకు సమాచారం శనివారం అందింది.
- విమానంలో ఆత్మాహుతి బాంబర్లు ఉన్నారని బెదిరింపులు ‘ప్రయాణికుల మాటున దిల్లీ విమానంలో ఐదుగురు ఆత్మాహుతి బాంబర్లు ప్రయాణిస్తున్నారు.. శంషాబాద్లో ల్యాండింగ్ కాగానే ఆ విమానాన్ని పేల్చివేస్తాం’ అంటూ గుర్తుతెలియని ఓ వ్యక్తి ఆర్జీఐఏ ఈ-మెయిల్కు సందేశం పంపించాడు.