ఎలాన్‌ మస్క్‌కు భారీ ఊరట

Eenadu icon
By Business News Desk Published : 21 Dec 2025 07:42 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

డోవర్‌: టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌కు న్యాయస్థానంలో భారీ విజయం లభించింది. 2018లో టెస్లా ఆయనకు ప్రకటించిన 55 బిలియన్‌ డాలర్ల వేతన ప్యాకేజీ విషయంలో డెలావేర్‌ సుప్రీంకోర్టు నుంచి మస్క్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. టెస్లాను వృద్ధి పథంలో నడిపించినందుకు గాను ప్రోత్సాహకం కింద ఈ ప్యాకేజీని ఆ సమయంలో కంపెనీ ఇవ్వాలనుకుంది. అయితే మస్క్‌కు ఇంత భారీ మొత్తంలో వేతన చెల్లింపుపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ కంపెనీకి చెందిన ఒక వాటాదారు కోర్టును ఆశ్రయించారు. మస్క్‌కు అనుకూలంగా ఉన్న బోర్డే ఈ వేతన ప్యాకేజీని రూపొందించిందని, అనుమతుల ప్రక్రియలో నిబంధనలనూ పాటించలేదని పేర్కొంటూ ఆ వేతన ప్యాకేజీని రద్దు చేస్తూ 2024లో కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే కింది కోర్టు ఇచ్చిన ఈ ఆదేశాల్లో పలు రకాల లోపాలు ఉన్నాయని చెబుతూ 2018 నాటి వేతన ప్యాకేజీ పునరుద్ధరించాలని తాజాగా డెలావేర్‌ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • రూ.7 లక్షల కోట్ల సంపద ఆవిరి అన్ని రంగాల షేర్లలో ముఖ్యంగా ఐటీ, లోహ రంగాల్లో అమ్మకాలు తీవ్రమై మన స్టాక్‌ మార్కెట్‌ భారీగా నష్టపోయింది. సెన్సెక్స్, నిఫ్టీ 1 శాతానికి పైగా క్షీణించాయి.
  • సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లే కాదు న్యాయవాదులు, అకౌంటెంట్లకూ కష్టమే వచ్చే ఏడాది, ఏడాదిన్నర సమయంలో ‘వైట్‌ కాలర్‌’ ఉద్యోగాల్లో చాలా వరకు ఆటోమేషన్‌కు గురయ్యే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్‌ ఏఐ సీఈఓ ముస్తఫా సులేమాన్‌ హెచ్చరిస్తున్నారు.
  • రిలయన్స్‌ చేతికి వెనెజువెలా చమురు! వెనెజువెలా నుంచి ముడిచమురును నేరుగా కొనుగోలు చేయడానికి, అమెరికా నుంచి సాధారణ లైసెన్స్‌ను ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) పొందింది.
  • జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఆదాయం రూ.4,083 కోట్లు జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్, డిసెంబరు త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.4,082.77 కోట్ల ఆదాయంపై రూ.173.96 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
  • లీడ్‌ బ్యాంక్‌ పథకానికి కొత్త రూపు జిల్లా స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు 1969లో ప్రవేశపెట్టిన లీడ్‌ బ్యాంక్‌ పథకం (ఎల్‌బీఎస్‌)లో మార్పులు చేయాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది.
  • పసిడి బాండులో రూ.3,449 పెట్టుబడిపై రూ.12,192 లాభం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గతంలో జారీ చేసిన పసిడి బాండ్లలో పెట్టిన పెట్టుబడులపై మదుపర్లు భారీగా ప్రతిఫలాన్ని పొందుతున్నారు.
  • విజయా డయాగ్నొస్టిక్స్‌ ఆదాయం రూ.205 కోట్లు రోగ నిర్థారణ సేవల సంస్థ విజయా డయాగ్నొస్టిక్స్, అక్టోబరు-డిసెంబరులో రూ.205.21 కోట్ల ఆదాయంపై రూ.43.17 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
  • నెఫ్రోకేర్‌ లాభం రూ.34.4 కోట్లు డయాలసిస్‌ సేవల సంస్థ నెఫ్రోకేర్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (నెఫ్రోప్లస్‌), ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.259.7 కోట్ల ఆదాయంపై రూ.34.4 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
  • రూ.10,000 కోట్ల మూలనిధితో స్టార్టప్‌ ఇండియా 2.0 పథకం రూ.10,000 కోట్ల మూలనిధితో స్టార్టప్‌ ఇండియా ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ పథకం, రెండో దశకు ప్రభుత్వం శుక్రవారం ఆమోదం తెలిపింది.
  • ఇంజినీరింగ్‌ ఉత్పత్తుల కోసం కొత్త ప్లాంటు సమగ్ర ఇంజినీరింగ్‌ సేవలు అందించేందుకు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నట్లు స్టాండర్డ్‌ ఇంజినీరింగ్‌ టెక్నాలజీ వెల్లడించింది.
  • స్పెక్ట్రమ్‌.. ఆస్తి కాదు టెలికాం కంపెనీలకు కేటాయించిన స్పెక్ట్రమ్‌ అనేది ఆస్తి కాదని, దివాలా స్మృతి(ఐబీసీ) ప్రక్రియలోకి అది రాదని సుప్రీం కోర్టు శుక్రవారం వెల్లడించింది.
  • ఓఎన్‌జీసీ డివిడెండ్‌ 125% ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఓఎన్‌జీసీ, డిసెంబరు త్రైమాసికంలో రూ.8,372 కోట్ల స్టాండలోన్‌ నికర లాభాన్ని ప్రకటించింది.
  • కార్ల టోకు విక్రయాల్లో 13% వృద్ధి జీఎస్‌టీ రేట్ల కోత వల్ల, ధరలు తగ్గిన ఫలితంగా గిరాకీ కొనసాగడంతో.. జనవరిలో కంపెనీల నుంచి డీలర్లకు ప్రయాణికుల వాహనాల (పీవీలు- కార్లు, ఎస్‌యూవీలు, వ్యాన్లు) సరఫరా 13% పెరిగినట్లు వాహన తయారీదార్ల సమాఖ్య (సియామ్‌) తెలిపింది.
  • సంక్షిప్త వార్తలు ఔషధ రంగంలోని హైదరాబాద్‌ సంస్థ విరూపాక్ష ఆర్గానిక్స్‌ లిమిటెడ్, తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ప్రతిపాదనకు సెబీ అనుమతి లభించింది.