వరుసగా మూడో విజయం.. యాషెస్‌ సిరీస్‌ ఆస్ట్రేలియా వశం

Eenadu icon
By Sports News Team Updated : 21 Dec 2025 09:44 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

అడిలైడ్: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా హవా కొనసాగుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందిన కంగారూలు.. అడిలైడ్ జరిగిన మూడో టెస్టులోనూ విజయకేతనం ఎగరవేశారు. ఇంగ్లాండ్‌ను 82 పరుగుల తేడాతో ఓడించి రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకున్నారు. 435 పరుగుల లక్ష్యఛేదనలో.. 207/6తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్.. 352 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు బ్యాటర్లలో ఓపెనర్ జాక్ క్రాలీ (85), జెమీ స్మిత్ (60), విల్ జాక్స్ (47) రాణింంచారు. జో రూట్ (39), బ్రైడన్ కార్స్ (39*), హ్యారీ బ్రూక్ (30) పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3, పాట్ కమిన్స్ 3, నాథన్ లైయన్ 3, స్కాట్ బోలాండ్ ఒక వికెట్ పడగొట్టారు.

రెండో ఇన్నింగ్స్‌లో ఓవర్‌నైట్‌ స్కోరు 271/4తో శనివారం ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా 349 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో 311/4తో బలమైన స్థితిలో ఉన్న కంగారూ జట్టు 38 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు చేజార్చుకుంది. మూడో రోజు సెంచరీ చేసిన ట్రావిస్‌ హెడ్‌ (170; 219 బంతుల్లో 16×4, 2×6).. ఓవర్‌నైట్‌ స్కోరుకు 28 పరుగులు జత చేసి ఔటయ్యాడు. అతడు వెనుదిరిగాక.. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ ఎంతోసేపు సాగలేదు. జోష్‌ టంగ్‌ (4/70), బ్రైడన్‌ కార్స్‌ (3/80) ఆస్ట్రేలియాను కట్టడి చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 371.. ఇంగ్లాండ్‌ 286 పరుగులు చేశాయి. ఆస్ట్రేలియా బ్యాటర్ అలెక్స్ కేరీ ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. కేరీ ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 106, రెండో ఇన్నింగ్స్‌లో 72 పరుగులు చేశాడు. నాలుగో టెస్టు డిసెంబరు 26న మెల్‌బోర్న్ వేదికగా ప్రారంభంకానుంది.

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 21 Dec 2025 09:35 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • మిస్టర్‌ మ్యాగ్జిమమ్‌.. మినిమమ్‌ అయ్యాడెందుకు? అభి కాస్త కంట్రోల్‌ అవ్వమ్మా.. కంగారు వలదు. లేదంటే ‘రోహిత్‌కి వారసుడు’ అని అంటున్న వాళ్లే ‘ఇక చాలు’ అని అంటారు. 
  • సూపర్-8 ముంగిట శ్రీలంకకు బిగ్‌ ట్రబుల్.. గాయంతో పతిరన ఔట్! సూపర్ -8లోకి వెళ్లిన శ్రీలంకకు పెద్ద దెబ్బ తగిలింది. స్టార్ పేసర్ పతిరన టీ20 ప్రపంచ కప్‌లోని మిగతా మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.
  • నమీబియాపై ఘన విజయం.. సూపర్-8కి పాకిస్థాన్ లీగ్‌ స్టేజ్‌లో మూడు మ్యాచులు గెలిచిన పాకిస్థాన్‌ సూపర్ -8లోకి దూసుకెళ్లింది. దీంతో యూఎస్‌ఏ, నెదర్లాండ్స్‌ ఆశలకు చుక్కెదురైంది.
  • పాకిస్థాన్‌పై ధనాధన్ ఇన్నింగ్స్‌.. టాప్‌ -10లోకి ఇషాన్ టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌పై సూపర్ ఇన్నింగ్స్‌ ఆడిన ఇషాన్‌ కిషన్‌ ఐసీసీ ర్యాంకుల్లో మెరుగైన స్థానం సంపాదించాడు.
  • పాక్‌ బ్యాటర్ ఫర్హాన్‌ సెంచరీ.. నమీబియా లక్ష్యం 200 కీలకమైన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ఓపెనర్ ఫర్హాన్ సెంచరీతో మెరిశాడు. టీ20 ప్రపంచ కప్‌లో నమీబియాతో పోరులో శతకం బాదాడు.
  • టీ20లంటే ఎందుకీ ‘కంగారూ’? ఆస్ట్రేలియా.. ఈ పేరు చెప్పగానే ఒకప్పుడు మిగిలిన జట్లు వణికిపోయేవి. మ్యాచ్‌లో దిగకముందే సగం ఓడిపోయేవి. 
  • మ్యాచ్ ఆడటానికి వెళ్లే ముందు గిన్నెలు కడుక్కోవాల్సి వచ్చింది: పాకిస్థాన్ హాకీ కెప్టెన్ ఆస్ట్రేలియా పర్యటనలో కనీస సౌకర్యాలకు నోచుకోకుండా, ఇబ్బంది పడుతూ గడిపి.. తిరిగి వచ్చిన తర్వాత పాకిస్థాన్‌ హాకీ కెప్టెన్ షకీల్ అహ్మద్ బట్ జాతీయ సమాఖ్యపై విమర్శలు గుప్పించాడు.
  • దక్షిణాఫ్రికా ఘన విజయం.. యూఏఈ చిత్తు దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
  • రాణించిన అలీషన్‌ షరాఫు.. దక్షిణాఫ్రికా విజయ లక్ష్యం 123 పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా దిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా, యూఏఈ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది.
  • రంజీట్రోఫీ ఫైనల్స్‌కు జమ్మూకశ్మీర్‌ జట్టు .. 67 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి రంజీ ట్రోఫీ సెమీఫైనల్స్‌లో జమ్మూకశ్మీర్‌ జట్టు మాజీ ఛాంపియన్‌ బెంగాల్‌ జట్టును ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో 67 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఫైనల్స్‌లోకి ప్రవేశించి చరిత్ర సృష్టించింది.
  • నా కెరీర్‌లో అదే కీలక మలుపు: హార్దిక్‌ పాండ్య టీమ్‌ఇండియా (Team India) ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్య తన కెరీర్‌లో కీలకమైన విషయం గురించి మాట్లాడాడు. టీ20 వరల్డ్‌కప్‌ 2016లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తాను వేసిన చివరి ఓవర్ ఎంతో ప్రత్యేకమన్నాడు.
  • కోహ్లీతో బాబర్‌ను పోల్చడం అన్యాయం: దినేశ్‌ కార్తిక్‌ పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్‌ స్టేజిలో టీమ్ఇండియాతో (Team India) జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ 61 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ బ్యాటర్‌ బాబర్‌ అజామ్‌ విఫలమయ్యాడు. 7 బంతులు ఎదుర్కొన్న అతడు కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు.
  • భారత్‌తో మ్యాచ్‌లో.. పాకిస్థాన్ చేసిన తప్పిదం అదే: రవిచంద్రన్‌ అశ్విన్‌ పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా టీమ్‌ఇండియా (Team India), పాకిస్థాన్‌ కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఆదివారం తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్‌ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
  • వచ్చాడో బేబీ యువరాజ్‌ అతడి దేశంలో క్రికెట్‌కు అనుకూలమైన పరిస్థితుల్లేవ్‌.. ఏడాదికి మూడు నెలలే ఆట. అలాంటి చోట నుంచి క్రికెట్లో ఎదిగి జాతీయ జట్టుకు ఆడడమే గొప్ప. అలాంటిది ప్రపంచకప్‌లో బరిలో దిగే అవకాశం వచ్చింది.
  • అజేయమేనా? హ్యాట్రిక్‌ విజయాలు.. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారీ గెలుపు.. టోర్నీలో మరే జట్టుకూ సాధ్యం కాని విధంగా అత్యధిక నెట్‌ రన్‌రేట్‌.. ఇలా టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా హవా మామూలుగా లేదు.
  • ఆస్ట్రేలియా ఔట్‌ మాజీ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాకు షాక్‌. మంగళవారం జింబాబ్వే, ఐర్లాండ్‌ మధ్య గ్రూప్‌-బి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో కంగారూ జట్టు టీ20 ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడిన ఆసీస్‌..
  • కివీసూ ముందుకు టీ20 ప్రపంచకప్‌లో సమీకరణాలతో పని లేకుండా న్యూజిలాండ్‌ సూపర్‌-8కు దూసుకెళ్లింది. మంగళవారం గ్రూప్‌-డి పోరులో కివీస్‌ 8 వికెట్ల తేడాతో కెనడాను చిత్తు చేసింది. మొదట కెనడా 4 వికెట్లకు 173 పరుగులు చేసింది.
  • కంగారు పడింది.. ఎన్నోసార్లు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఆస్ట్రేలియా, ప్రపంచకప్‌ అనగానే టాప్‌ ఫామ్‌ను అందుకునే జట్టు టీ20 ప్రపంచకప్‌ నుంచి ఇంత త్వరగా నిష్క్రమించడం ఏమాత్రం ఊహించనిదే.
  • పాక్‌ నిలుస్తుందా? టీ20 ప్రపంచకప్‌ నుంచి ఇప్పటికే ఆస్ట్రేలియా నిష్క్రమించింది. మరో పెద్ద జట్టు భవితవ్యం బుధవారం తేలిపోనుంది. గత మ్యాచ్‌లో భారత్‌ చేతిలో గట్టి దెబ్బ తిన్న పాకిస్థాన్‌.. తన చివరి గ్రూప్‌ పోరులో నమీబియాను ఢీకొనబోతోంది.
  • ముగింపులో నేపాల్‌ మెరుపు పెద్ద జట్టు ఇంగ్లాండ్‌పై విజయానికి అత్యంత చేరువగా వెళ్లి, త్రుటిలో ఓడిన నేపాల్‌.. టీ20 ప్రపంచకప్‌ను అదిరే విజయంతో ముగించింది. గ్రూప్‌-సిలో తొలి మూడు మ్యాచ్‌లూ ఓడి సూపర్‌-8 రేసు నుంచి నిష్క్రమించిన ఆ జట్టు.. స్కాట్లాండ్‌తో మంగళవారం చివరి పోరులో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.