Muhammad Yunus: హాదీ అంత్యక్రియల్లో.. యూనస్ కీలక వ్యాఖ్యలు

Eenadu icon
By International News Team Updated : 21 Dec 2025 11:35 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత వ్యతిరేకి, ఇంకిలాబ్‌ మోంచో నేత షరీఫ్‌ ఉస్మాన్‌ హాదీ ఆదర్శాలను ముందుకు తీసుకెళ్తామని బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్‌ యూనస్‌ చేసిన వ్యాఖ్యలు ఆందోళన  రేకెత్తిస్తున్నాయి (Yunus on Anti India leader Hadi ideals). అతడి అంత్యక్రియల్లో పాల్గొన్న యూనస్‌.. అక్కడున్న వేలాది మందిని ఉద్దేశించి ప్రసంగించారు. 

‘ఉస్మాన్‌ హాదీ.. మీకు వీడ్కోలు చెప్పేందుకు ఇక్కడకు రాలేదు. బంగ్లాదేశ్ ఉన్నంత కాలం.. ఈ దేశ ప్రజలందరి హృదయాల్లో ఉంటారు. అక్కడి నుంచి నిన్ను ఎవరూ తొలగించలేరు. నువ్వు మాకు చెప్పిన మాటను నెరవేరుస్తామని ప్రమాణం చేస్తున్నా. దేశ ప్రజలందరూ మీ ఆదర్శాలను కొనసాగిస్తారు’ అని అన్నారు. హాదీ (Osman Hadi) ప్రేమ, మానవత్వం, ప్రజలతో కలిసిపోయే విధానాన్ని యూనస్‌ ప్రశంసించారు. ఈ దేశం మరచిపోలేనీ మంత్రాన్ని హాదీ తమకు ఇచ్చారని.. అది ఎప్పటికీ తమ చెవుల్లో ప్రతిధ్వనిస్తోందన్నారు. ప్రపంచం ముందు బంగ్లా తలెత్తుకుని ఉంటుందని.. ఎవరి వద్ద తలవంచదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పాల్గొనాలనే హాదీ అకాంక్ష గురించి యూనస్‌ (Muhammad Yunus) ప్రస్తావించారు. 

  • బంగ్లాదేశ్‌ యువనేత హాదీ అంత్యక్రియలు పూర్తి

షేక్‌ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ పార్టీని గద్దె దింపేందుకు గతేడాది విద్యార్థులు చేపట్టిన ఆందోళనలో హాదీ కీలక పాత్ర పోషించాడు. ఈనెల ఆరంభంలో గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై దాడి చేశారు. దీంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. హాదీ మృతితో బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. శనివారం అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య అతడి అంత్యక్రియలు జరిగాయి.

► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 21 Dec 2025 11:24 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • బంగ్లాదేశ్‌ ప్రధానిగా తారిఖ్ రెహమాన్ ప్రమాణస్వీకారం Bangladesh PM Tarique Rahman: బంగ్లాదేశ్‌ నూతన ప్రధానిగా తారిఖ్‌ రెహమాన్‌ మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు.
  • వీసా హక్కు కాదు : అమెరికా విదేశాంగ శాఖ కఠిన వీసా విధానాలపై అమెరికా విదేశాంగ మరోసారి స్పందించింది. వీసా అనేది హక్కు కాదని, విదేశీ పర్యటకులు దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడితే దాన్ని రద్దు చేస్తామని హెచ్చరించింది.
  • ఇమ్రాన్‌ఖాన్‌కు అనారోగ్యం.. పాకిస్థాన్‌కు కపిల్‌దేవ్, గావస్కర్ రిక్వెస్ట్ Imran Khan: ఇమ్రాన్‌ఖాన్‌కు మెరుగైన చికిత్స అందించాలని దిగ్గజ క్రికెటర్లు పాక్‌ను కోరారు. 
  • అమెరికా బాటలో చైనా.. మెరైన్‌ కోర్‌ ఏర్పాటు ప్రపంచవ్యాప్తంగా సైనిక ఆపరేషన్లు చేసేందుకు అమెరికా మాదిరిగా చైనా సైతం మెరైన్‌ కోర్‌ను ఏర్పాటుచేసింది. 
  • యూనస్‌ నోట మళ్లీ ‘సెవెన్‌ సిస్టర్స్‌’.. వెళ్లిపోతూ భారత్‌పై కవ్వింపులు Bangladesh: బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇప్పటివరకు తాత్కాలిక ప్రభుత్వ సారథిగా ఉన్న మహమ్మద్‌ యూనస్‌ సోమవారం తన పదవి నుంచి వైదొలిగారు.
  • పిల్లలపై లైంగిక వేధింపులు.. అమెరికాలో భారతీయుడి అరెస్ట్‌ Indian Man Arrested: పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో భారత్‌కు చెందిన ఓ వ్యక్తి అమెరికాలో అరెస్ట్‌ అయ్యాడు. నిందితుడిని ఓడెల యశస్వీ కొత్తపల్లిగా గుర్తించారు.
  • ముంబయి తీరంలో సీజ్‌ అయిన నౌకలు ఇరాన్‌వే! చమురు అక్రమ రవాణాకు పాల్పడుతున్న కారణంగా భారత్‌ కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది సీజ్‌ చేసిన మూడు నౌకలకు ఇరాన్‌తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.
  • కిమ్‌ కుమార్తెకు వారసత్వ పగ్గాలు! నిరంకుశ పాలనకు చిరునామాగా నిలిచే ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ రాజ్యంలో కుటుంబ పోరుకు తెరలేచిందా? అధికార పగ్గాల కోసం కిమ్‌ సోదరి, కుమార్తె పోటీ పడనున్నారా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతున్నాయి.
  • గ్రహాంతర జీవులు సంప్రదింపులు జరిపినట్లు ఆధారాల్లేవు: ఒబామా గ్రహాంతర జీవులున్నాయంటూ ఓ పాడ్‌కాస్ట్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
  • బ్రిటన్, కెనడా పౌరులకు చైనాలో వీసారహిత ప్రవేశం చైనాలో వీసా లేకుండా పర్యటించే అవకాశం బ్రిటన్, కెనడా దేశాల ప్రజలకు మంగళవారం నుంచి అందుబాటులోకి రానుంది.
  • పాక్‌లో భారీ చోరీ.. 700 తులాల బంగారు కడ్డీలు మాయం! పాకిస్థాన్‌లో భారీ చోరీ జరిగింది. ఓ ఆభరణాల దుకాణంలోకి చొరబడిన దుండగులు.. 300 మిలియన్‌ పాకిస్థానీ రూపాయల విలువైన బంగారం, వజ్రాభరణాలను ఎత్తుకెళ్లారు.