మహాత్మాగాంధీ పేరునే కొనసాగించాలని సీపీఎం నాయకుల ధర్నా

Eenadu icon
By Andhra Pradesh Dist. Team Published : 19 Dec 2025 14:14 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

కర్నూలు టౌన్  : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరునే  కొనసాగించాలని  కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఎం నాయకులు ధర్నా చేపట్టారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వికసిత్‌ భారత్‌- జీ రామ్ జీ పథకంగా పేరు మార్పు చేయడాన్ని వారు వ్యతిరేకించారు. ఈ  పథకం పేరును కేంద్ర ప్రభుత్వం యథాతథంగా కొనసాగించాలని వారు కోరారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం 40శాతం భారాన్ని భరించాలన్న నిర్ణయం సరికాదని సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ అన్నారు.

► Read latest Kurnool Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • నైపుణ్య ప్రాంగణం.. అతివలకు వరం [ 19-02-2026] మహిళల స్వయం ఉపాధికి బాటలు వేస్తేనే.. పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతాయని నాటి పాలకులు భావించారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణలో మహిళా ప్రాంగణం ఏర్పాటు చేశారు.
  • పార్కు జాగాలో పాగా [ 19-02-2026] ఈనాడు, కర్నూలు: నగరంలో పార్కు స్థలాలు యథేచ్ఛగా కబ్జా అవుతున్నాయి..కబ్జాదారుల చెర నుంచి విముక్తిచేసి అభివృద్ధి చేయాలని కాలనీ వాసులు ఆందోళనలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఆక్రమణదారులు ఏకంగా అంతర్గత రహదారులు,
  • మల్లన్న కళ్లకు గంతలు [ 19-02-2026] శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల భక్తజనం తీవ్ర ఇబ్బందులు పడింది. బ్రహ్మోత్సవాల రెండో రోజు ఈ నెల 9వ తేదీన తాత్కాలిక క్యూలైన్‌ మెష్‌ కుప్పకూలిన అంశంపై ప్రాథమిక విచారణ చేయగా పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
  • సద్గుణాల ద్వారం.. రంజాన్‌ మాసం [ 19-02-2026] సద్గుణాల ద్వారం.. పుణ్యాల సాగరం.. వరాల వసంతమైన రంజాన్‌ మాసం అరుదెంచింది. బుధవారం సాయంత్రం నెలవంక దర్శనంతో పవిత్ర మాసం ప్రారంభమైంది. ఈ నెల 19వ తేదీ నుంచి ఉపవాస దీక్షలు మొదలు కానున్నాయి.
  • కమీషన్ల క్రమబద్ధీకరణ [ 19-02-2026] మధ్యతరగతి, పేదల ప్రయోజన నిమిత్తం కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్‌ఆర్‌ఎస్, బీపీఎస్‌ పథకాలు లైసెన్స్‌డ్‌ టెక్నికల్‌ పర్సన్ల (ఎల్‌టీపీ)కు కాసులు కురిపిస్తున్నాయి. గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఆ పార్టీకి చెందిన పలువురు అక్రమ వెంచర్లు వేశారు.
  • వృథా ఖాతాలో రూ. 12.56 కోట్లు [ 19-02-2026] వివిధ పథకాల నిర్వహణకు.. అభివృద్ధి పనుల అమలుకు ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేస్తోంది. ఆ మొత్తాన్ని అధికారులు వేర్వేరు బ్యాంకుల ఖాతాల్లో నిల్వ ఉంచుతారు. ఆ అధికారులు బదిలీపై వెళ్లిన తర్వాత ఆయా ఖాతాలను నిర్వహించే వారు కరవవుతున్నారు.
  • క్షణికావేశంతో.. యువకుడి ఆత్మహత్య [ 19-02-2026] ప్రేమ పెళ్లి వద్దన్నందుకు క్షణికావేశంలో మహేశ్‌(20) అనే యువకుడు ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆదోని పట్టణంలో జరిగింది. మూడో పట్టణ ఎస్సై రామస్వామి తెలిపిన వివరాల మేరకు..
  • వేగంగా స్పందించి.. ఆభరణాలు అప్పగించి [ 19-02-2026] ఆర్టీసీ బస్సులో మరచిపోయిన బంగారు ఆభరణాల బ్యాగును పోలీసులు వేగంగా స్పందించి సంబంధిత మహిళకు అప్పగించిన సంఘటన బుధవారం ఆదోని పట్టణంలో జరిగింది. ఒకటో పట్టణ సీఐ చంద్రశేఖర్‌ తెలిపిన వివరాల మేరకు..
  • అవహేళన చేశాడని స్నేహితుడి హత్య [ 19-02-2026] జాతీయ రహదారి-44 సమీపంలోని మదార్‌పురం గ్రామంలో ఈ నెల 12న కోళ్లఫారంలో డోన్‌కు చెందిన సురేష్‌(25) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. విచారణ అనంతరం సీసీ కెమెరా ఆధారంగా హత్యగా నిర్ధారించి,