Padmanabhaswamy temple: ‘స్మార్ట్ కళ్లజోడుతో’ పద్మనాభుడి ఆలయంలోకి.. సింగపూర్ టూరిస్ట్పై కేసు!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

తిరువనంతపురం: కేరళలోని శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలోని వెళ్లిన ఓ పర్యటకుడు.. కెమెరా అమర్చిన కళ్లద్దాలతో రికార్డు చేసేందుకు ప్రయత్నించాడు. దీన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని సింగపూర్లోని నార్త్షోర్ డ్రైవ్ నివాసి తిరునీపనార్ (49)గా గుర్తించారు. అయితే, అతడు శ్రీలంక సంతతి వ్యక్తిగా భావిస్తున్నారు.
కెమెరా అమర్చిన స్మార్ట్ కళ్లజోడు ధరించిన తిరునీపనార్.. శనివారం ఉదయం ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశించి లోపల వీడియో చిత్రీకరించడం మొదలుపెట్టాడు. ఆలయ ఉత్తరం వైపు, తులాభారం మండపంతోపాటు ఇతర ప్రదేశాలను చిత్రీకరించాడు. దీన్ని గుర్తించిన ఆలయ భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. అనంతరం ఫోర్ట్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతడికి నోటీసులు అందించిన పోలీసులు డిసెంబర్ 21న విచారణకు రావాలని సూచించారు.
► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తెలంగాణలో రెండు స్థానాలకు.. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ ఏడాది ఏప్రిల్లో 10 రాష్ట్రాల్లోని 37 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం పూర్తికాబోతోంది.
- కదులుతున్న వాహనాల డోర్లు తీస్తూ.. బైకర్ ప్రమాదకర స్టంట్లు రోడ్డుపై కదులుతున్న వాహనాల డోర్లను తీస్తూ.. ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసిన బైకర్ను దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
- కునో పార్కులో మూడు కూనలకు జన్మనిచ్చిన చీతా Cheetah: మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కు (Kuno National Park)లో ‘గామిని’ అనే దక్షిణాఫ్రికా చీతా మూడు కూనలకు జన్మనిచ్చింది.
- సరిహద్దుల్లో ‘ఏఐ’తో చైనా కుట్రలు భగ్నం.. ఆర్మీ అధికారి Army-AI: దేశ రక్షణ రంగంలో కృత్రిమ మేధ కీలకంగా మారుతోందని స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ దినేశ్ సింగ్ రానా తెలిపారు.
- రఫేల్లో 50% దేశీయ తయారీ పరికరాలు ఉండాలి : రాజ్నాథ్ సింగ్ Rafale jets: రఫేల్ ఫైటర్ జెట్లో 50 శాతం దేశీయ తయారీ పరికరాలు ఉండేలా చూడాలని ఫ్రాన్స్ను కోరారు.
- తప్పు జరిగింది.. క్షమించండి: దిల్లీలో కారు ప్రమాదానికి కారణమైన బాలుడి తండ్రి Delhi: దిల్లీలో మైనర్ బాలుడు నిర్లక్ష్యంగా కారు నడిపి.. ఓ వ్యక్తి మృతికి కారణమైన సంగతి తెలిసిందే. దీనిపై బాలుడి తండ్రి స్పందిస్తూ.. మృతుని కుటుంబానికి క్షమాపణలు తెలిపారు.
- కొంకణ్ తీర పర్యాటకులకు డాల్ఫిన్ల గుంపు కనువిందు మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా పరిధిలో గల కొంకణ్ తీరంలో పర్యాటకులకు డాల్ఫిన్లు గుంపుగా కనిపించి కనువిందు చేశాయి.
- వైద్యుడి ఫోన్ నంబరు కోసం గూగుల్లో వెదికితే.. ఖాతా ఖాళీ సైబర్ కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతుల్లో ప్రజల ఖాతాలను గుల్ల చేస్తున్నారు. మధ్యప్రదేశ్లోని శహడోల్ జిల్లాలో మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది.
- ఐఎన్ఎస్ కృష్ణ జలప్రవేశం తొలి స్వదేశీ కేడెట్ శిక్షణ నౌక (సీటీఎస్) ఐఎన్ఎస్ కృష్ణ జలప్రవేశం చేసినట్టు నేవీ వర్గాలు మంగళవారం తెలిపాయి. చెన్నైలోని కట్టుపల్లి వద్ద లార్సన్ అండ్ టుబ్రో యార్డులో ఈ కార్యక్రమం జరిగినట్లు వెల్లడించాయి.
- కర్ణాటకలో హెలికాప్టర్ అసెంబ్లింగ్ యూనిట్ కర్ణాటకలోని కోలారు జిల్లా వేమగల్లో భారత తొలి ప్రైవేటురంగ హెలికాప్టర్ అసెంబ్లింగ్ యూనిట్ ‘ఫైనల్ అసెంబ్లీ లైన్’ (ఎఫ్ఏఎల్)ను మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్తో కలిసి ముంబయి నుంచి వర్చువల్గా ప్రారంభించారు.
- నూరుకోట్లకు బ్రాడ్బ్యాండ్ వినియోగదారుల సంఖ్య దేశంలో బ్రాడ్ బ్యాండ్ వినియోగదారుల సంఖ్య గత పదేళ్లలో ఆరు కోట్ల నుంచి వంద కోట్లకు చేరిందని కేంద్ర కమ్యూనికేషన్లశాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. 2014-2025 మధ్యకాలంలో ఈ గొప్ప మైలురాయిని దాటడం సాధ్యమైందని చెప్పారు.
- శ్రీపెరుంబుదూర్లో అతిపెద్ద కార్మిక ఆసుపత్రి తమిళనాడులోని కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్లో కార్మికుల కోసం దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రి నిర్మించనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి తంగం తెన్నరసు ప్రకటించారు. 18,720 పడకల ఈ ఆసుపత్రి నిర్మాణానికి రూ.706 కోట్లు కేటాయించారు.
- ఫ్రాన్స్తో భాగస్వామ్యం ఇక ప్రత్యేకం తమ మధ్య సంబంధాలను ‘ప్రత్యేక ప్రపంచవ్యాప్త వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచాలని భారత్-ఫ్రాన్స్ నిర్ణయించాయి.
- పిటిషన్లలో ఏఐ వినియోగం ఆందోళనకరం కృత్రిమ మేధ సాధనాల సాయంతో రూపొందించిన పిటిషన్లను న్యాయస్థానాలకు సమర్పించే వైఖరి న్యాయవాదుల్లో ప్రబలడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
- కాంగ్రెస్ మనుగడకు మూలం అసమ్మతే అసమ్మతిని సహించలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉంటే అది ఆ పార్టీ వినాశనానికే దారి తీస్తుందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ అభిప్రాయపడ్డారు.
- అదో తుగ్లకీయ కమిషన్ ఎన్నికల సంఘం ‘‘తుగ్లకీయ కమిషన్’’లా వ్యవహరిస్తోందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ఆరోపించారు.
- బెంగాల్, తమిళనాడుల్లో ఏప్రిల్లో ఎన్నికలు! నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలను ఏప్రిల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) అధికారులు మంగళవారం వెల్లడించారు.
- రైళ్ల మరుగుదొడ్లలో జెట్ స్ప్రేలు రైలు బోగీల్లోని మరుగుదొడ్లలో కొళాయి, చైన్తో కూడిన స్టీలు మగ్గుల స్థానంలో జెట్ స్ప్రేలు ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
- ఆసక్తికరమైన ఏఐ ప్రాజెక్టులు ప్రదర్శించిన ఎల్పీయూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఇండియా-ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పోలో లవ్లీ ప్రొఫెషనల్ విశ్వవిద్యాలయ (ఎల్పీయూ) ప్రాజెక్టులు అందరి మన్ననలు పొందాయని వర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
- మాకు పెన్షన్లు వద్దు శ్రీలంక చట్టసభ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పదవీకాలం ముగిశాక పెన్షన్లు తీసుకోరాదని నిర్ణయించారు.