కాంగ్రెస్ పార్టీకి డిసెంబరు నెల కీలకమైంది: సీఎం రేవంత్రెడ్డి

- A
- A+
- A++

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి డిసెంబరు నెల ఎంతో కీలకమైందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి( Revanth Reddy) అన్నారు.. క్రిస్మస్ను పురస్కరించుకొని హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన వేడుకలకు సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ‘‘ తెలంగాణలో క్రిస్మస్ జరుపుకొంటున్నామంటే సోనియాగాంధీ పాత్ర, త్యాగం ఉంది. ఇదే డిసెంబరులో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. సోనియాగాంధీ కూడా ఇదే నెలలోనే జన్మించారు. ఏసు ప్రభువు బోధనల స్ఫూర్తితో మా ప్రభుత్వం పనిచేస్తోంది. శాంతిని కాపాడుతూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. పేదవాడి ఆకలి తీర్చాలని ఆనాడు కాంగ్రెస్పార్టీ ఆహార భద్రత చట్టం తెచ్చింది. ప్రతి పేదవాడికి నెలకు 6 కిలోల సన్న బియ్యం అందిస్తున్నాం. ఉచిత విద్యుత్ పథకం ద్వారా 50లక్షల మంది పేదల ఇళ్లలో వెలుగులు నింపాం. రెండేళ్లలో వ్యవసాయంపై రూ.1.04లక్షల కోట్లు ఖర్చు పెట్టాం.
ద్వేషించే వారిని కూడా ప్రేమించేలా ఏసు ప్రభువు చేశారు. ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించడానికి ఏసు జన్మించారు. క్రిస్టియన్ మిషనరీస్.. దేశంలో ప్రభుత్వంతో సమానంగా విద్య, వైద్యం అందించాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మనిషి సగటు జీవన ప్రమాణం 32 ఏళ్లు.. ప్రస్తుతం 72 ఏళ్లకు చేరుకున్నామంటే. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ప్రయత్నం చేశాయో.. అంతే సమానంగా క్రిస్టియన్ మిషనరీస్ సంస్థలు కృషి చేశాయి. అన్ని మతాల పట్ల సమానంగా ఉంటాం. ఇతర మతాలను కించపరిచేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో హేట్ రేట్ చట్టం ప్రవేశపెడతాం’’ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. రూ.30వేల చొప్పున రాష్ట్రంలోని 7వేల చర్చిలకు క్రిస్మస్ వేడుకల కోసం రూ.33 కోట్లు కేటాయించినట్టు క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్ దీపక్ జాన్ వెల్లడించారు. వేడుకల్లో మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- విడాకులు ఇచ్చిందన్న కోపంతో.. మాజీ భార్యను హత్య చేసి.. వనస్థలిపురంలోని గ్రీన్సిటీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది.
- పెట్రోల్ పోసి నిప్పంటించుకున్న ఘటన.. వ్యక్తి మృతి తనతో పెళ్లికి నిరాకరించిందన్న కక్షతో వివాహితపై పెట్రోల్ పోసి ఆపై నిప్పటించుకున్న ఘటనలో వ్యక్తి మృతిచెందాడు.
- ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు లైన్ క్లియర్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు అడ్డంకి తొలగింది. ఛైర్మన్ ఎన్నికపై తుది నిర్ణయం ఆర్వోదేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
- తెలుగు రాష్ట్రాల్లో పలు కోర్టులకు బాంబు బెదిరింపులు తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
- రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తెలంగాణలో రెండు స్థానాలకు.. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ ఏడాది ఏప్రిల్లో 10 రాష్ట్రాల్లోని 37 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం పూర్తికాబోతోంది.
- స్టాండింగ్లోనే.. సిట్.. ముందుకు కదలని బెట్టింగ్ యాప్ల కేసు దర్యాప్తు అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్న బెట్టింగ్ యాప్లకు ముకుతాడు వేసేందుకు ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పేరుకే పరిమితమైంది.
- భారతీయ ప్రతిభా సామర్థ్య వేదిక ఆలోచనలు, ఆవిష్కరణలు, సంకల్పాల శక్తిమంత కలయిక ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో-2026’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
- సినీ నటి ప్రత్యూష మృతి కేసులో.. సిద్ధార్థరెడ్డికి రెండేళ్ల జైలు శిక్ష ఖరారు రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డికి తెలంగాణ హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేసింది.
- సినీనటుడు మోహన్బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో సినీనటుడు, మోహన్బాబు యూనివర్సిటీ (ఎంబీయూ) ఛాన్స్లర్ మోహన్బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
- తీరంలో యుద్ధ నౌకల జాతర ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్) సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం రాత్రి విశాఖ ఈఎన్సీ ఆఫీసర్స్ మెస్లో విందు (ప్రెసిడెన్షియల్ బాంక్వెట్) ఇచ్చారు.
- హంగ్లో అదృష్ట హస్తం ఛైర్పర్సన్ ఎన్నికలు వాయిదా పడిన 11 మున్సిపాలిటీల్లో మంగళవారం 8 చోట్ల ఆ ప్రక్రియను పూర్తిచేశారు.
- బయో వరల్డ్గా తెలంగాణరాష్ట్రం ‘బయో ఆసియా తన పేరును దాటి.. బయో వరల్డ్గా మారుతోంది. ఈ సభను చూస్తుంటే.. బయో వరల్డ్గా తెలంగాణ ఎదుగుతుందనే విషయాన్ని నేను గర్వంగా చెప్పగలను.
- రూ.1,700 కోట్ల పెట్టుబడులు బయో ఆసియా 2026 సదస్సు వేదికగా మంగళవారం తెలంగాణకు రూ.1,700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
- విలువలు, విధానాలపై కుటుంబ సభ్యులకు స్పష్టత ఉండాలి వ్యాపార సంస్థల నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, పాటించాల్సిన విలువలపై కుటుంబ సభ్యులందరికీ స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే.. కుటుంబ వ్యాపారాలు దీర్ఘకాలం మనగలుగుతాయని మార్గదర్శి చిట్ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ అన్నారు.
- మీ టాయిలెట్టే మీ డాక్టర్ వైద్యఆరోగ్య రంగంలో సాంకేతికంగా పెను మార్పులు వస్తున్నాయి. వైద్య నిర్ధారణ పరీక్షలు సులభతరం అవుతున్నాయి.
- 70 ఇంజినీరింగ్ కళాశాలల్లో పాత ఫీజులే రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలకు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ) షాక్ ఇవ్వనుంది.
- డాన్.. సింబా.. లియో డాన్.. సింబా.. లియో.. చార్లీ.. టైసన్.. రాణా.. విరాట్.. పోలీసు సాయుధబలగాల్లో చేరేందుకు సిద్ధమైన సుశిక్షిత జాగిలాలివి.
- చెత్త కనిపిస్తే సహించేది లేదు రాజధాని పరిధిలోకి వచ్చే మూడు నగరపాలక సంస్థల పరిధిలో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
- ఎప్సెట్ దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు ఎప్సెట్ దరఖాస్తు స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా, రిజిస్ట్రేషన్ సంఖ్యను పోగొట్టుకున్నప్పటికీ మళ్లీ పొందేలా కొత్త సదుపాయాలను అందుబాటులోకి తెచ్చినట్లు కన్వీనర్ ఆచార్య కె.విజయకుమార్రెడ్డి వెల్లడించారు.
- రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం భాజపానే పురపాలిక ఎన్నికల్లో భాజపా కరీంనగర్ కార్పొరేషన్, నారాయణపేట మున్సిపాలిటీలను కైవసం చేసుకుందని, భవిష్యత్తులో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా శ్రేణులు శ్రమించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు పిలుపునిచ్చారు.