బాలుడికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేసిన మంత్రి అచెన్న

Eenadu icon
By Andhra Pradesh Dist. Team Published : 20 Dec 2025 18:40 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

సంతబొమ్మాళి: మండలంలోని సీతానగరం గ్రామానికి చెందిన తామాడ జ్యోతీశ్ వర్మ అనే బాలుడు గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. బాధిత కుటుంబ సభ్యులు తెదేపా సీనియర్ నాయకులు వాడరేవు కృష్ణారావును సంప్రదించారు. ఆయన ఈ విషయాన్ని మంత్రి అచ్చెన్నాయుడి దృష్టికి తీసుకెళ్లి.. బాలుడు ఆరోగ్యం, అతని కుటుంబ ఆర్థిక పరిస్థితిని వివరించారు. దీంతో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.1,72,875 నగదును వైద్య ఖర్చులు కోసం మంత్రి మంజూరు చేయించారు.  ఈ మొత్తాన్ని బాలుడి వైద్య కోసం వినియోగించాలని సూచించారు. ఈ సందర్భంగా బాలుడు తల్లి శిరీష, కుటుంబ సభ్యులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. శనివారం కోటబొమ్మాళిలోని తెదేపా కార్యాలయంలో బాధిత కుటుంబానికి చెక్కులను అందజేశారు. వారివెంట కూటమి నాయకులు లింగుడూ కుమార్, బత్సల బ్రహ్మానందం, గోపాల్, పాపారావు, రామారావు తదితరులు ఉన్నారు.

► Read latest Srikakulam Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • తరిమే ఆపదను ‘తల’చుకోరేం..! [ 19-02-2026] జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఆగట్లేదు. వరుస ఘటనలతో పాటు మరణాల రేటు పెరుగుతోంది. బాధితుల్లో ద్విచక్ర వాహనదారులే ఎక్కువగా ఉండటం గమనార్హం.
  • కలిసొచ్చే కాలం.. కోరుతోంది ఊతం [ 19-02-2026] ప్రపంచ వాణిజ్య చిత్రపటంలో జిల్లాకు గుర్తింపు తీసుకొచ్చింది నీలి గ్రానైట్‌.. అగ్రశ్రేణి నాణ్యతను సొంతం చేసుకున్న ఆ గ్రానైట్‌ ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో వ్యాపారులకు కాసులు కురిపిస్తోంది..
  • కాసులందక.. కన్నీళ్లు ‘ఆప్కో’లేక..! [ 19-02-2026] మగ్గాలపై నేసిన వస్త్రాన్ని మార్కెట్‌లో విక్రయించేందుకు చేనేత కార్మికులు ప్రభుత్వ రంగ సంస్థ ఆప్కోను ఆశ్రయిస్తారు. ఇతర ప్రాంతాల్లో అక్కడి ప్రజల అభిరుచికి తగినట్లుగా ఉత్పత్తులను విక్రయించేందుకు వీలుగా నిల్వలను కార్మికులు అందజేస్తారు.
  • ముక్కంటి సన్నిధిలో.. భక్తజన‘ధార’.. [ 19-02-2026] వంశధార.. జనధార అయ్యింది.. ఆ ముక్కంటి స్మరణతో భక్తి ప్రవాహమై పారింది.. స్వామి సేవలో భక్తలోకం తడిసి ముద్దయింది.. ఇసుక తిన్నెలపై శివనామం మారుమోగింది.. దక్షిణ కాశీగా పేరొందిన శ్రీముఖలింగంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి.
  • యువకుడిపై బీరు సీసాలతో దాడి [ 19-02-2026] పాతకక్షల నేపథ్యంలో ఇంట్లో నిద్రిస్తున్న యువకుడిపై బీరు సీసాలతో దాడి చేసిన ఘటన కొత్తూరులోని బ్రాహ్మణ వీధిలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు..
  • మద్యం దుకాణంలో చోరీ [ 19-02-2026] శ్రీకాకుళం నగర పరిధి ఫాజుల్‌బాగ్‌పేట పరిధి కిమ్స్‌ ఆసుపత్రి రోడ్డులోని లక్కీ వైన్స్‌ దుకాణంలో బుధవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. మంగళవారం రాత్రి పని వేళలు ముగిసిన తర్వాత ముగ్గురు సిబ్బంది తాళాలు వేసి వెళ్లారు.
  • బక్కచిక్కిన బాహుదా..! [ 19-02-2026] వైకాపా పాలనలో బాహుదా నదిని నిర్లక్ష్యం చేయడంతో రైతులు వ్యవసాయానికి, ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. 11 ఓపెన్‌ హెడ్‌ ఛానళ్లు అభివృద్ధికి ప్రతిపాదనలు రూపొందించినా అమలుకు నోచుకోలేదు.
  • తేలుస్తారా.. తెలుసుకోవడమేనా? [ 19-02-2026] రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో విద్యార్థినుల వేధింపుల ఫిర్యాదులపై మరోసారి విచారణ జరిగింది. రెండు నెలల కిందట ఉన్నతాధికారులు హడావుడి చేయడంతో బాధ్యులపై చర్యలు తీసుకుంటారని విద్యార్థులు ఆశించినా అలా జరగలేదు.