Fruits: మన చుట్టూ పండు... పోషకాలు మెండు

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

డ్రాగన్ ఫ్రూట్.. కివీ.. అవకాడోల డిమాండ్, ధర రెండూ ఎక్కువే.. చాలామందికి ఖరీదైన పండ్లలోనే పోషకాలు ఎక్కువ ఉంటాయన్న అపోహ ఉంటుంది. అయితే తక్కువ ధరకు లభించే వాటిలోనూ చాలా పోషకాలు ఉంటాయని... వాటిని కాస్త ఎక్కువగా తింటే సరిపోతుందంటున్నారు జాతీయ పోషకాహార సంస్థ నిపుణులు.
డ్రాగన్ స్థానంలో బొప్పాయి..
- తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు అందించే పండ్లు అనేకం మనకు అందుబాటు ధరల్లోనే లభిస్తున్నాయి. అధిక పోషకాలున్న పండ్ల కోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. తక్కువ ధరల్లో లభించే వాటినే ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. ఉదాహరణకు వంద గ్రాముల బ్లూబెర్రీ పండ్లతో పోల్చితే జామపండులో లభించే పీచు పదార్థాలు, విటమిన్-సి, ప్రోటీన్లు, పోషకాలు ఎక్కువ.
- రూ.95 ఖర్చు చేసి కొనుగోలు చేసే అవకాడోకు బదులు రూ.30లో లభించే కొబ్బరి, కిలో రూ.80 ఖరీదైన డ్రాగన్ఫ్రూట్ స్థానంలో రూ.40 బొప్పాయి, కివీకి ప్రత్యామ్నాయంగా ఉసిరిని తీసుకోవచ్చు.
జామతో లాభాలెన్నో..
- నారింజతో పోల్చితే జామపండులో విటమిన్ ‘సి’ సుమారు 5 రెట్లు ఎక్కువ లభిస్తుంది.
- పొటాషియం కోసం ఎక్కువ మంది అరటి పండును ఎంచుకుంటారు. కానీ జామలో తక్కువ తీపి పదార్థంతో ఎక్కువ పొటాషియం ఉంటుంది.
- అరటి, ఆపిల్, నారింజ పండ్లలో 2.5 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ పీచు పదార్థం ఉంటే జామలో ఏకంగా 6 మిల్లీగ్రాములు లభిస్తుంది.
ఆ పండ్లే మేలు..
- అన్ని పండ్లలో సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఫాలిఫినాల్స్, ఫైటో కెమికల్లు ఖరీదైన పండ్లల్లో ఎక్కువ ఉండడంతో అవే తినడం మంచిదన్న అభిప్రాయానికి వస్తున్నారు.
- మన చుట్టూ ఉండే, చౌకగా లభ్యమయ్యే పండ్లలో ఇవి తక్కువ మోతాదులో ఉన్నా 50గ్రా స్థానంలో 100గ్రాములు తినడం ద్వారా అవసరమైన పోషకాలు పొందొచ్చు.
- వేర్వేరు పండ్లలో పొటాషియం, మెగ్నీషియం ఎక్కువ గనుక అన్ని పండ్లు తినాలని సూచిస్తుంటాం.
- శీతాకాలంలో కొన్ని పండ్లను తినకూడదంటూ ఆంక్షలు పెడుతుంటారు. అవన్నీ అపోహలే.
- భోజనానికి ముందు లేదా తర్వాత జామపండ్లు తింటే ఐరన్ను శోషించుకునే సామర్థ్యం పెరుగుతుంది.
- ఆకుకూరలతో పాటు వీటిని కూడా తింటే పూర్తిస్థాయిలో ఐరన్ లభిస్తుందని ఎన్ఐఎన్ అధ్యయనంలోనూ వెల్లడైంది.
- జామ పండులోని అధిక పొటాషియం గుండె సంబంధిత వ్యాధులున్నవారికి మేలు చేస్తుంది.
- మధుమేహం ఉన్నవారు బాగా పండినవి కాకుండా దోరగా ఉన్నవి తినొచ్చు.

గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- స్టాండింగ్లోనే.. సిట్.. ముందుకు కదలని బెట్టింగ్ యాప్ల కేసు దర్యాప్తు అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్న బెట్టింగ్ యాప్లకు ముకుతాడు వేసేందుకు ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పేరుకే పరిమితమైంది.
- భారతీయ ప్రతిభా సామర్థ్య వేదిక ఆలోచనలు, ఆవిష్కరణలు, సంకల్పాల శక్తిమంత కలయిక ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో-2026’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
- సినీ నటి ప్రత్యూష మృతి కేసులో.. సిద్ధార్థరెడ్డికి రెండేళ్ల జైలు శిక్ష ఖరారు రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డికి తెలంగాణ హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేసింది.
- సినీనటుడు మోహన్బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో సినీనటుడు, మోహన్బాబు యూనివర్సిటీ (ఎంబీయూ) ఛాన్స్లర్ మోహన్బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
- తీరంలో యుద్ధ నౌకల జాతర ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్) సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం రాత్రి విశాఖ ఈఎన్సీ ఆఫీసర్స్ మెస్లో విందు (ప్రెసిడెన్షియల్ బాంక్వెట్) ఇచ్చారు.
- హంగ్లో అదృష్ట హస్తం ఛైర్పర్సన్ ఎన్నికలు వాయిదా పడిన 11 మున్సిపాలిటీల్లో మంగళవారం 8 చోట్ల ఆ ప్రక్రియను పూర్తిచేశారు.
- బయో వరల్డ్గా తెలంగాణరాష్ట్రం ‘బయో ఆసియా తన పేరును దాటి.. బయో వరల్డ్గా మారుతోంది. ఈ సభను చూస్తుంటే.. బయో వరల్డ్గా తెలంగాణ ఎదుగుతుందనే విషయాన్ని నేను గర్వంగా చెప్పగలను.
- రూ.1,700 కోట్ల పెట్టుబడులు బయో ఆసియా 2026 సదస్సు వేదికగా మంగళవారం తెలంగాణకు రూ.1,700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
- విలువలు, విధానాలపై కుటుంబ సభ్యులకు స్పష్టత ఉండాలి వ్యాపార సంస్థల నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, పాటించాల్సిన విలువలపై కుటుంబ సభ్యులందరికీ స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే.. కుటుంబ వ్యాపారాలు దీర్ఘకాలం మనగలుగుతాయని మార్గదర్శి చిట్ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ అన్నారు.
- మీ టాయిలెట్టే మీ డాక్టర్ వైద్యఆరోగ్య రంగంలో సాంకేతికంగా పెను మార్పులు వస్తున్నాయి. వైద్య నిర్ధారణ పరీక్షలు సులభతరం అవుతున్నాయి.
- 70 ఇంజినీరింగ్ కళాశాలల్లో పాత ఫీజులే రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలకు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ) షాక్ ఇవ్వనుంది.
- డాన్.. సింబా.. లియో డాన్.. సింబా.. లియో.. చార్లీ.. టైసన్.. రాణా.. విరాట్.. పోలీసు సాయుధబలగాల్లో చేరేందుకు సిద్ధమైన సుశిక్షిత జాగిలాలివి.
- చెత్త కనిపిస్తే సహించేది లేదు రాజధాని పరిధిలోకి వచ్చే మూడు నగరపాలక సంస్థల పరిధిలో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
- ఎప్సెట్ దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు ఎప్సెట్ దరఖాస్తు స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా, రిజిస్ట్రేషన్ సంఖ్యను పోగొట్టుకున్నప్పటికీ మళ్లీ పొందేలా కొత్త సదుపాయాలను అందుబాటులోకి తెచ్చినట్లు కన్వీనర్ ఆచార్య కె.విజయకుమార్రెడ్డి వెల్లడించారు.
- రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం భాజపానే పురపాలిక ఎన్నికల్లో భాజపా కరీంనగర్ కార్పొరేషన్, నారాయణపేట మున్సిపాలిటీలను కైవసం చేసుకుందని, భవిష్యత్తులో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా శ్రేణులు శ్రమించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు పిలుపునిచ్చారు.
- ప్రతి ముగ్గురిలో ఒక చిన్నారికి భారతీయ టీకాలు ప్రపంచంలోని ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరికి భారత్ నుంచి టీకాలు సరఫరా అవుతున్నాయని భారత్ బయోటెక్ చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ డాక్టర్ రేచస్ ఎల్ల తెలిపారు.
- నా బిడ్డకు పూర్తి న్యాయం జరగలేదు తన బిడ్డకు వందశాతం న్యాయం జరిగిందని భావించట్లేదని ప్రత్యూష తల్లి సరోజినీదేవి అన్నారు. ఆమె మంగళవారం ఇక్కడ ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు.
- మాటలు.. మంటలు.. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో మంగళవారం మున్సిపల్ ఛైర్పర్సన్లు, వైస్ఛైర్పర్సన్ల ఎన్నిక ప్రక్రియ సందర్భంగా కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
- మున్సిపల్ ఎన్నికల్లో.. ముందూ.. వెనకా పంపకాలే మున్సిపల్ ఎన్నికల్లో ఆద్యంతం.. కాసుల హవాయే నడిచింది. పోలింగ్ వరకు ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు పంచిన రాజకీయ పార్టీలు.. కౌంటింగ్ తర్వాత బలసమీకరణలో భాగంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఆకట్టుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి.
- పొత్తు కొనసాగేది.. లేనిది కాంగ్రెస్ చేతిలోనే కొత్తగూడెం కార్పొరేషన్గా ఏర్పడ్డ మొదటి ఎన్నికల్లోనే సీపీఐ అపూర్వ విజయం సాధించిందని, కాంగ్రెస్తో పొత్తు లేకున్నా సత్తాచాటామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.