ఢిల్లీ:దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం, పొగమంచు కమ్మేసింది. ఢిల్లీలో గాలి పీలిస్తే సిగరెట్ తాగినట్లుగా పరిస్థితి మారిపోయింది. ఉదయం వేళ హైవేలపై దట్టమైన పొగమంచు అలుముకుంటోంది. పట్టపగలే లైట్లు వేసి వాహనదారులు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. రైళ్ల రాకపోకలకు సైతం అంతరాయం ఏర్పడింది. ఈ మేరకు 15 రాష్ట్రాలకు రైల్వే శాఖ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు విజిబులిటీ స్థాయి జీరో లెవెల్కి చేరుకుంది. పంజాబ్, హరియాణాలో విజిబులిటీ 50 మీటర్ల లోపే ఉంది. కాశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్లో చలి తీవ్రత మరింతగా ఉంది. ఆయా రాష్ట్రాల్లో సరస్సులు సైతం గడ్డకడుతున్నాయి.
Updated at - Dec 19 , 2025 | 10:09 PM