అమరావతి, డిసెంబర్ 19:ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ టైమ్ టైబుల్ వచ్చేసింది. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు శుక్రవారం నాడు ఇంటర్ ఇగ్జామ్స్‌కి సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేసింది. 2026 ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చ్ 24వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు జరగనున్నాయి. 2026 ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చ్ 23వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు జరుగనున్నాయి. ఈ మేరకు షెడ్యూలు విడుదల చేసింది ఇంటర్ బోర్డు.