శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండల పరిధిలో పెను ప్రమాదం తప్పింది. ఓ బస్సు పట్టాలు దాటుతూ మధ్యలోనే ఆగిపోయింది. ప్రయాణికులు సకాలంలో స్పందించారు. మొదట భయపడ్డా తర్వాత కిందకు దిగి బస్సును రైలు పట్టాల మీద నుంచి పక్కకు తీసుకువచ్చారు. బస్సు ఇంజిన్‌లో సాంకేతిక లోపం కారణంగా ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో రైలు రాకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. లేకపోయి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేది.


ఇవి చదవండి

Updated at - Dec 24 , 2025 | 09:58 PM