శ్రీకాకుళం, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి):వైసీపీ (YSRCP)అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)జన్మదినోత్సవం వేళ వైసీపీకి భారీ షాక్ తగిలింది. శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నంలో 3000 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు స్వాగతం పలికారు.

వీరిలో పలువురు జెడ్పీటీసీలు, సర్పంచ్లు ఉన్నారు. వీరి చేరిక టీడీపీకి మరింత బలాన్ని ఇస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గ్రామస్థాయి రాజకీయాల్లో వీరి చేరికతో బలం పెరుగుతోందని టీడీపీ నేతలు కూడా అంటున్నారు. వైసీపీకి ఇది కోలుకోలేని దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీలో ఈ కొత్త చేరికలు, 2024 ఎన్నికల కోసం ప్రత్యేకంగా టీడీపీకి మంచి ఫలితాలు అందించవచ్చని పేర్కొన్నారు.



ఈ వార్తలు కూడా చదవండి..
Read LatestAP NewsAndTelugu News